Today Horoscope: ఈ రాశి వారికి బీమా పన్నులు పెన్షన్ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి
ABN , Publish Date - Sep 29 , 2025 | 12:40 AM
నేడూ రాశిఫలాలు 29-09-2025 సోమవారం, ఉద్యోగ, వ్యాపారాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. వివాహ నిర్ణయాలకు అనుకూలం...
నేడూ రాశిఫలాలు 29-09-2025 సోమవారం, ఉద్యోగ, వ్యాపారాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. వివాహ నిర్ణయాలకు అనుకూలం.

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. వివాహ నిర్ణయాలకు అనుకూలం. వేడుకల్లో గౌరవ, మర్యాదలు అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. శ్రీ రుద్ర కవచ పారాయణ శుభప్రదం.

వృషభం (ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. బీమా, పన్నులు, పెన్షన్ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. సాయంత్రం నుంచి పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది. శివపంచాక్షరీ పారాయణ శుభప్రదం.

మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
సన్నిహితుల వైఖరి ఆనందం గురిచేస్తుంది. వేడుకల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. సాయంత్రం నుంచి సమావేశాల్లో మాటపడాల్సి రావచ్చు. భాగస్వామి వైఖరి బాధిస్తుంది. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. శ్రీ రుద్ర కవచ పారాయణ శుభప్రదం.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
పట్టుదలతో వ్యవహరించి ఆశించిన ఫలితాలు సాధిస్తారు. సన్నిహితుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సాయంత్రం నుంచి కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో పొరపాట్లు కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. ఒక సమాచారం బాధిస్తుంది. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ప్రియతముల విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. క్రీడలు, ఆడిటింగ్, టెలివిజన్ రంగాల వారికి ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సాయంత్ర నుంచి ఖర్చులు అధికం. విలువైన వస్తువుల కొనుగోలులో జాగ్రత్తలు పాటించాలి. శివ అష్టోత్తర శతనామ పారాయణ శుభప్రదం.

కన్య ( ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. మీ ఆలోచనలను సమీక్షించుకుంటారు. సాయంత్రం నుంచి రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. అన్నదానం శుభప్రదం.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
లక్ష్య సాధనలో విద్యార్థులు విజయం సాధిస్తారు. ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. సాయంత్రం నుంచి కీలక పత్రాలు, అగ్రిమెంట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రైవింగ్లో నిదానం అవసరం. ఒక సమాచారం కలవరం కలిగిస్తుంది. గోమాతను సేవించండి.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడుల విషయంలో పథకం ప్రకారం వ్యవహరించి మంచి ఫలితాలు సాధిస్తారు. బృంద కార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. సాయంత్రం నుంచి ఖర్చులు అధికం. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల నుంచి ఒత్తిళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. శ్రీ రుద్ర కవచ పారాయణ శుభప్రదం.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
గౌరవ, ప్రతిష్ఠలు పెంపొందుతారు. పెద్దలు, పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సాయంత్రం నుంచి కొత్త పనుల ప్రారంభాన్ని వాయిదా వేయడం మంచిది. లక్ష్య సాధనలో పెద్దల సహకారం లోపిస్తుంది. పరమశివుని ఆరాధన శుభప్రదం.

మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)
దూరప్రయాణాలు, ఉన్నత విద్యా విషయాల్లో లక్ష్యాలు సాధిస్తారు. మీ అంచనాలు ఫలిస్తాయి. సాయంత్రం నుంచి పనులు పూర్తి కాకపోవడంతో ఆందోళనకు గురవుతారు. సమావేశాలు, చర్చలు, ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీ రుద్ర కవచ పారాయణ మంచిది.

కుంభం (జనవరి 21- ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రుణాలు మంజూరవుతాయి. సాయంత్రం నుంచి సన్నిహతుల ఆరోగ్యం కలపవరపెడుతుంది. బృంద కార్యక్రమాల కోసం ఖర్చులు అధికం. విలువైన వస్తువుల విషయాలో అప్రమత్తత అవసరం. గోమాతను ఆరాధించండి.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
సమావేశాల్లో, బృందకార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. గౌరవ, మర్యాదలు అందుకుంటారు. సాయంత్రం నుంచి వివాహ నిర్ణయాల విషయంలో పెద్దల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. కీలక పదవుల విషయంలో ఆశాభంగం కలిగే అవకాశం ఉంది. పరమశివుని ఆరాధన ఊరటనిస్తుంది.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ