సెమీకండక్టర్ల తయారీకి తెలంగాణ అనుకూలం
ABN , Publish Date - Jan 10 , 2025 | 03:46 AM
సెమీకండక్టర్ల తయారీకి తెలంగాణ అనుకూలంగా ఉందని ‘చిప్ వార్’ పుస్తక రచయిత డాక్టర్ క్రిస్ మిల్లర్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంటుందన్నారు..
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): సెమీకండక్టర్ల తయారీకి తెలంగాణ అనుకూలంగా ఉందని ‘చిప్ వార్’ పుస్తక రచయిత డాక్టర్ క్రిస్ మిల్లర్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంటుందన్నారు. గురువారం టీ-హబ్లో ఐటీ శాఖ, వీఎల్ఎ్సఐ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన ‘మేకింగ్ ఇండియా ఏ సెమీకండక్టర్ ప్రొడక్ట్ నేషన్’ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టెక్నాలజీ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతుందని, ఈ క్రమంలోనే సెమీకండక్టర్లకు ప్రాధాన్యం పెరిగిందని వివరించారు. భవిష్యత్తులో సెమీకండక్టర్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశాలే మార్కెట్ను శాసిస్తాయన్నారు.