తాన్లా ప్లాట్ఫామ్స్ రూ 175 కోట్ల షేర్ల బైబ్యాక్
ABN , Publish Date - Jun 17 , 2025 | 01:21 AM
బహిరంగ మార్కెట్ నుంచి సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేసే (బైబ్యాక్) ప్రతిపాదనకు తాన్లా ప్లాట్ఫామ్స్ బోర్డు సోమవారం ఆమోదం తెలిపింది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): బహిరంగ మార్కెట్ నుంచి సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేసే (బైబ్యాక్) ప్రతిపాదనకు తాన్లా ప్లాట్ఫామ్స్ బోర్డు సోమవారం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా కంపెనీ 1.49 శాతం వాటాకు సమానమైన 20 లక్షల ఈక్విటీ షేర్లను ఒక్కొక్కటి రూ.875 చొప్పున బైబ్యాక్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ లెక్కన కంపెనీ బైబ్యాక్ కోసం రూ.175 కోట్ల వరకు వెచ్చించనుంది. బైబ్యాక్ తేదీని మాత్రం ఇంకా ప్రకటించాల్సి ఉంది. తాన్లా ప్లాట్ఫామ్ సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేయనుండటం గడిచిన ఐదేళ్లలో ఇది మూడోసారి. 2020లో రూ.154 కోట్లు, 2022లో రూ.170 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేసింది. కాగా సోమవారం బీఎ్సఈలో కంపెనీ షేరు 1.31 శాతం నష్టంతో రూ.656.90 వద్ద ముగిసింది.
గోద్రెజ్ ఇంటీరియో నుండి 'పెప్-అప్ కేఫ్ టేబుల్' విడుదల
గోద్రెజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్లోని ప్రముఖ ఫర్నిచర్ బ్రాండ్ ఇంటీరియో, కార్యాలయాల కోసం తమ సరికొత్త 'పెప్-అప్ కేఫ్ టేబుల్' శ్రేణిని విడుదల చేసింది. ఆధునిక కార్యాలయాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ఫర్నిచర్, పనితీరు, శైలి ఆకట్టుకుంటోంది.
ఇవీ చదవండి:
సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఐఫోన్, మ్యాక్బుక్ రిపేర్ బాధ్యతలు నిర్వహించనున్న టాటా
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి