బుచ్కు లోక్పాల్ క్లీన్చిట్
ABN , Publish Date - May 29 , 2025 | 02:28 AM
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ మాజీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్కు అవినీతి నిరోధక అంబుడ్స్మన్ లోక్పాల్ క్లీన్చిట్ ఇచ్చింది. అమెరికా షార్ట్ షెల్లింగ్, మార్కెట్ రీసెర్చ్ కంపెనీ..
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ మాజీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్కు అవినీతి నిరోధక అంబుడ్స్మన్ లోక్పాల్ క్లీన్చిట్ ఇచ్చింది. అమెరికా షార్ట్ షెల్లింగ్, మార్కెట్ రీసెర్చ్ కంపెనీ హిండెన్బర్గ్ ఆరోపణల ఆధారంగా అనుచితం, పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించి బుచ్పై దాఖలైన ఫిర్యాదులను లోక్పాల్ బుధవారం తోసిపుచ్చింది. ఆ అభియోగాలన్నీ కేవలం అనుమానాలు, ఊహలే తప్ప వాటిని ధ్రువీకరించే ఆధారాలేమీ లేవంది. అదానీ గ్రూప్ నిధుల అక్రమ మళ్లింపునకు ఉపయోగించిన విదేశీ ఫండ్లలో మాధవి పురి బుచ్తోపాటు ఆమె భర్త ధవల్ బుచ్కు రహస్య వాటాలున్నాయని హిండెన్బర్గ్ గత ఆగస్టులో ఆరోపించింది. అంతేకాదు, సెబీ పదవీ చేపట్టాక కూడా మాధవి పురి బుచ్ తన మాజీ సంస్థ ఐసీఐసీ బ్యాంక్ నుంచి పారితోషికం అందుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే, బుచ్ ఆ ఆరోపణలన్నింటినీ ఖండించారు.
ఇవీ చదవండి:
నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్ను ఓవర్ టేక్ చేసిన వైనం
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి