Share News

ప్రపంచంలో అత్యంత విలువైన టెక్‌ దిగ్గజాల్లో రిలయన్స్‌

ABN , Publish Date - Jun 03 , 2025 | 05:01 AM

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సకు మరో గౌరవం దక్కింది. ప్రపంచంలోని 30 అత్యంత విలువైన లిస్టెడ్‌ టెక్‌ దిగ్గజ కంపెనీల జాబితాలో రిలయన్స్‌కూ చోటు లభించింది..

ప్రపంచంలో అత్యంత విలువైన టెక్‌ దిగ్గజాల్లో రిలయన్స్‌

రూ.18.45 లక్షల కోట్ల మార్కెట్‌ విలువతో

23వ స్థానంలో అంబానీ కంపెనీ

న్యూఢిల్లీ: భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సకు మరో గౌరవం దక్కింది. ప్రపంచంలోని 30 అత్యంత విలువైన లిస్టెడ్‌ టెక్‌ దిగ్గజ కంపెనీల జాబితాలో రిలయన్స్‌కూ చోటు లభించింది. ఈ లిస్ట్‌లో స్థానం దక్కించుకున్న ఏకైక భారత కంపెనీ ఇదే. ‘ట్రెండ్స్‌- ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌’ పేరుతో సోమవారం విడుదలైన రిపోర్టు ప్రకారం.. 21,600 కోట్ల డాలర్ల (రూ.18.45 లక్షల కోట్లు) మార్కెట్‌ విలువతో రిలయన్స్‌ 23వ స్థానంలో నిలిచింది. కాగా, అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్‌, ఎన్‌విడియా, యాపిల్‌, అమెజాన్‌, ఆల్ఫాబెట్‌, మెటా ప్లాట్‌ఫామ్స్‌, టెస్లా, బ్రాడ్‌కామ్‌ వరుసగా తొలి 8 స్థానాలను కైవసం చేసుకున్నాయి. తైవాన్‌కు చెందిన టీఎ్‌సఎంసీ 9వ స్థానంలో ఉంది. చైనా కంపెనీ టెన్సెంట్‌ 10వ స్థానంలో ఉంది.

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 03 , 2025 | 05:01 AM