పిట్టీ ఇంజనీరింగ్ లాభం రూ.29 కోట్లు
ABN , Publish Date - Feb 14 , 2025 | 01:28 AM
పిట్టీ ఇంజనీరింగ్ లిమిటెడ్ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.421 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.28.76 కోట్ల నికర లాభాన్ని...

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): పిట్టీ ఇంజనీరింగ్ లిమిటెడ్ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.421 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.28.76 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోల్చితే లాభం 83.07 శాతం, ఆదాయం 37.95 శాతం వృద్ధి చెందాయి. కాగా డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలలకు గాను రూ.1,271.06 కోట్ల ఆదాయంపై రూ.86.14 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంచనాలకు తగ్గట్టుగానే పనితీరు ఉందని, కంపెనీ ఇటీవల చేపట్టిన విలీనాలు, కొనుగోళ్లు అన్నింటినీ సమీకృతం చేసే ప్రక్రియ కొనసాగుతోందని పిట్టీ ఇంజనీరింగ్ ఎండీ, సీఈఓ అక్షయ్ ఎస్ పిట్టీ తెలిపారు.
For Business News And Telugu News