Share News

మారుతి ని తాకిన మాగ్నెట్ల కొరత

ABN , Publish Date - Jun 11 , 2025 | 03:15 AM

రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్ల కొరత దేశంలో అతిపెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ)ని తాకింది. ఈ ప్రభావం కంపెనీ త్వరలో...

మారుతి ని తాకిన మాగ్నెట్ల కొరత

  • ఈ-విటారా ఉత్పత్తిలో భారీ కోత

న్యూఢిల్లీ: రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్ల కొరత దేశంలో అతిపెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ)ని తాకింది. ఈ ప్రభావం కంపెనీ త్వరలో విడుదల చేసే ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ఈ-విటారాపై పడింది. ఈ మాగ్నెట్ల కొరతతో ఈ సంవత్సరం ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య కాలంలో 26,512 ఈ-విటారా ఈవీలు ఉత్పత్తి చేయాలన్న లక్ష్యాన్ని కంపెనీ 8,221 కి కుదించుకుంది. కంపెనీ అధికారికంగా ఈ విషయం ధ్రువీకరించడం లేదు. అయితే రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్ల ఎగుమతులపై చైనా విధించిన ఆంక్షలే ఇందుకు కారణమని తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 11 , 2025 | 03:15 AM