జోస్ అలుక్కా్సలో అక్షయ తృతీయ ఆఫర్లు
ABN , Publish Date - Apr 30 , 2025 | 05:59 AM
అక్షయ తృతీయను పురస్కరించుకుని జోస్ అలుక్కాస్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది...
హైదరాబాద్: అక్షయ తృతీయను పురస్కరించుకుని జోస్ అలుక్కాస్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా రూ.75,000 లేదా అంతకు పైబడిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వినియోగదారులకు ఉచితంగా బంగారు నాణేన్ని అందిస్తున్నట్లు జోస్ అలుక్కాస్ ప్రకటించింది. అంతేకాకుండా వజ్రాభరణాలను కొనుగోలు చేసే వారికి ప్రతి క్యారట్పై రూ.15,000 ఫ్లాట్ డిస్కౌంట్ను అందిస్తోంది. దీంతో పాటుగా ప్రతి క్యారట్కు ఉచితంగా 500 మిల్లీగ్రాముల బంగారు నాణేన్ని కాంప్లిమెంటరీగా ఇస్తోంది. అలాగే ప్లాటినం ఆభరణాలపై 15 శాతం వరకు తరుగు చార్జీలను తగ్గిస్తున్నట్లు జోస్ అలుక్కాస్ వెల్లడించింది. బంగారు ఆభరణాల మేకింగ్ చార్జీల్లో 30 శాతం వరకు రాయితీని అందిస్తోంది. వెండి ఆభరణాలు తరుగు చార్జీలు లేకుండా లభిస్తాయని తెలిపింది. దీంతో పాటు తమ పాత బంగారాన్ని హెచ్యూఐడీ ధృవీకరణ కలిగిన ఆభరణాలతో మార్పిడి చేసుకోవాలనుకునే వినియోగదారులకు ప్రత్యేక ఎక్స్ఛేంజ్ లాభాలను ఆఫర్ చేస్తున్నట్లు జోస్ అలుక్కాస్ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
Read More Business News and Latest Telugu News