5 నెలల కనిష్ఠానికి ద్రవ్యోల్బణం
ABN , Publish Date - Feb 13 , 2025 | 05:43 AM
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం జనవరి నెలలో ఐదు నెలల కనిష్ఠ స్థాయి 4.31 శాతానికి దిగి వచ్చింది. కూరగాయలు, గుడ్లు, పప్పు దినుసుల ధరల్లో తగ్గుదల ఇందుకు దోహదపడింది. గత ఏడాది ఆగస్టులో...

న్యూఢిల్లీ: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం జనవరి నెలలో ఐదు నెలల కనిష్ఠ స్థాయి 4.31 శాతానికి దిగి వచ్చింది. కూరగాయలు, గుడ్లు, పప్పు దినుసుల ధరల్లో తగ్గుదల ఇందుకు దోహదపడింది. గత ఏడాది ఆగస్టులో నమోదైన కనిష్ఠ స్థాయి 3.65ు కాగా ఆ తర్వాత నమోదైన కనిష్ఠ స్థాయి ఇదే. డిసెంబరు నెలలో ద్రవ్యోల్బణం 5.22ుగా ఉంది. డిసెంబరుతో పోల్చితే జనవరిలో ఇది 0.91ు తగ్గింది. కాగా జనవరిలో ఆహార వస్తువుల విభాగంలో ద్రవ్యోల్బణం 6.02ు ఉంది. డిసెంబరుతో పోల్చితే గ్రామీ ణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 5.76 శాతం నుంచి 4.64 శాతానికి దిగి వచ్చినట్లు ఎన్ఎ్సఓ తెలిపింది. ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణం 8.65 శాతం నుంచి 6.31 శాతానికి తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో ఆహార ద్రవ్యోల్బణం 7.9 శాతం నుంచి 5.53 శాతానికి దిగిరాగా స్థూల ద్రవ్యోల్బణం 4.58 శాతం నుంచి 3.87 శాతానికి దిగి వచ్చింది.
కుంగిన పారిశ్రామికం: గనులు, తయారీ రంగం నీరసపడడంతో డిసెంబరు నెలలో పారిశ్రామికాభివృద్ధి రేటు మూడు నెలల కనిష్ఠ స్థాయి 3.2 శాతానికి తగ్గింది. ప్రభుత్వం గత నవంబరు పారిశ్రామికాభివృద్ధి రేటును 5.2ు నుంచి 5 శాతానికి కుదించింది. కాగా డిసెంబరులో తయారీ రంగం వృద్ధిరేటు 4.6ునుంచి 3 శాతానికి, గను ల రంగం వృద్ధిరేటు 5.2ు నుంచి 2.6 శాతానికి తగ్గాయి.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..
Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం
Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్కి కీలక పదవి
Also Read: మరోసారి కుల గణన సర్వే
Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు
Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం
For AndhraPradesh News And Telugu News