Share News

విశ్వాస సూచీలో 3 స్థానానికి జారిన భారత్‌

ABN , Publish Date - Jan 21 , 2025 | 06:44 AM

ప్రభుత్వం, వ్యాపారాలు, మీడియా, ఎన్‌జీఓలపై ప్రజల నమ్మకం విషయంలో భారత్‌ రెండు నుంచి మూడో స్థానానికి జారుకుందని ఎడెల్‌వెన్‌ ట్రస్ట్‌ బారోమీటర్‌...

విశ్వాస సూచీలో 3 స్థానానికి జారిన భారత్‌

ప్రభుత్వం, వ్యాపారాలు, మీడియా, ఎన్‌జీఓలపై ప్రజల నమ్మకం విషయంలో భారత్‌ రెండు నుంచి మూడో స్థానానికి జారుకుందని ఎడెల్‌వెన్‌ ట్రస్ట్‌ బారోమీటర్‌ 25వ వార్షిక నివేదిక వెల్లడించింది. దేశంలోని సంపన్న వర్గంతో పోలిస్తే అల్పాదాయ జనాభాలో విశ్వసనీయత మరింత లోపించిందని రిపోర్టు పేర్కొంది. ఈ సూచీలో చైనా, ఇండోనేషియా వరుసగా 1, 2 స్థానాల్లో నిలిచాయి. జపాన్‌, యూకే అట్టడుగున ఉన్నాయి. కాగా, ఇతర దేశాల ప్రజలు, దేశంలో ప్రధాన కార్యాలయం కలిగిన విదేశీ కంపెనీలను నమ్మే విషయంలో భారత్‌ 13వ స్థానంలో ఉంది.

Updated Date - Jan 21 , 2025 | 06:44 AM