Share News

పెరిగిన జీవీకే హోటల్స్‌ లాభం

ABN , Publish Date - Feb 04 , 2025 | 06:12 AM

డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో తాజ్‌ జీవీకే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన రూ.33.89 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో...

పెరిగిన జీవీకే హోటల్స్‌ లాభం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో తాజ్‌ జీవీకే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన రూ.33.89 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో లాభం రూ.24.21 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో కంపెనీ రెవెన్యూ కూడా రూ.111.93 కోట్ల నుంచి రూ.128.66 కోట్లకు పెరిగింది. డిమాండ్‌ కొనసాగటంతో పాటు విస్తరణ కారణంగా ఆదాయం 15 శాతం పెరగటం ఎంతగానో కలిసి వచ్చిందని కంపెనీ పేర్కొంది. కాగా బెంగళూరులోని యెలహంకలో ఏర్పాటు చేస్తున్న హోటల్‌ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని, వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నట్లు జీవీకే హోటల్స్‌ వెల్లడించింది.


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 04 , 2025 | 06:12 AM