జీఆర్టీ జువెలర్స్.. స్వర్ణ అవతారం
ABN , Publish Date - Feb 04 , 2025 | 06:22 AM
జీఆర్టీ జువెలర్స్ తన 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా వినియోగదారులు...
హైదరాబాద్: జీఆర్టీ జువెలర్స్ తన 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా వినియోగదారులు తమ పాత బంగారు ఆభరణాలను సరికొత్త ఆభరణాలుగా మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో ‘స్వర్ణ అవతారం’, తమిళనాడులో ‘తంగ అవతారం’ పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా వినియోగదారులు తమ పాత బంగారాన్ని మార్పిడి చేసుకున్నప్పుడు గ్రాముకు అదనంగా రూ.75 అందించనున్నట్లు జీఆర్టీ జువెలర్స్ వెల్లడించింది. ఈ పరిమిత కాల ఆఫర్ కేవలం బంగారం ఎక్స్ఛేంజీలో మాత్రమే అందుబాటులో ఉండనుంది. బంగారు నాణేలు లేదా కడ్డీల కొనుగోళ్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండదని జీఆర్టీ జువెలర్స్ తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..