Technology : కీలక టెక్నాలజీ ప్రాజెక్టులకు రూ.18,000 కోట్లు
ABN , Publish Date - Feb 02 , 2025 | 05:31 AM
కీలక టెక్నాలజీ ప్రాజెక్టులకు ప్రభుత్వం కేటాయింపులు పెంచింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను మొబైల్ ఫోన్లు, ఐటీ హార్డ్వేర్, రంగాలకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ)తో పాటు సెమీకండక్టర్ పథకం, ఇండియాఏఐ మిషన్ కోసం వార్షిక ప్రాతిపదికన
కీలక టెక్నాలజీ ప్రాజెక్టులకు ప్రభుత్వం కేటాయింపులు పెంచింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను మొబైల్ ఫోన్లు, ఐటీ హార్డ్వేర్, రంగాలకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ)తో పాటు సెమీకండక్టర్ పథకం, ఇండియాఏఐ మిషన్ కోసం వార్షిక ప్రాతిపదికన 84 శాతం పెంపుతో రూ.18,000 కోట్లు కేటాయించింది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాజెక్టుల కేటాయింపులను రూ.9,766 కోట్లకు సవరించింది. దేశంలో కృత్రిమ మేధ (ఏఐ) ఆవరణ వ్యవస్థ అభివృద్ధితో పాటు ఇందుకు అవసరమైన మౌలిక వసతులకు ఆర్థిక మద్దతు కల్పించేందుకు ప్రారంభించిన ఇండియాఏఐ మిషన్కు ఈసారి కేటాయింపులను 11 రెట్లకు పెంచి రూ.2,000 కోట్లకు చేర్చారు. కేంద్ర ఎలకా్ట్రనిక్స్, ఐటీ శాఖకు మొత్తం రూ.26,026.25 కోట్లు కేటాయించారు.