వెండి రూ.5,000 జంప్
ABN , Publish Date - Jul 15 , 2025 | 05:20 AM
వెండి కొండెక్కుతోంది. ఢిల్లీ మార్కెట్లో కిలో ధర ఏకంగా రూ.5,000 పెరుగుదలతో సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.1.15 లక్షలకు చేరింది. హైదరాబాద్ మార్కెట్లోనైతే...
ఢిల్లీలో రూ.1.15 లక్షలకు చేరిన కిలో ధర
న్యూఢిల్లీ: వెండి కొండెక్కుతోంది. ఢిల్లీ మార్కెట్లో కిలో ధర ఏకంగా రూ.5,000 పెరుగుదలతో సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.1.15 లక్షలకు చేరింది. హైదరాబాద్ మార్కెట్లోనైతే రూ.1.25 లక్షలు పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో దీని రేటు 14 ఏళ్ల (2011 సెప్టెంబరు తర్వాత) గరిష్ఠ స్థాయి 39.02 డాలర్లకు ఎగబాకడంతో దేశీయంగానూ అమాంతం పెరిగింది. అంతర్జాతీయంగా పారిశ్రామిక రంగాల్లో, ముఖ్యంగా ఎలకా్ట్రనిక్స్ ఉత్పత్తుల తయారీలో వెండి వినియోగం భారీగా పెరుగుతుండటం, ట్రంప్ సుంకాలతో నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు, బులియన్ ఇన్వెస్టర్లు బంగారానికి ప్రత్యామ్నయంగా వెండిలో పెట్టుబడులు పెంచుకోవడం ఈ ర్యాలీకి ప్రధాన కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా, మేలిమి (99.9ు స్వచ్ఛత) బంగారం రేటు దేశ రాజధానిలో రూ.200 పెరిగి రూ.99,570కి చేరగా.. అంతర్జాతీయమార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ మూడు వారాల గరిష్ఠ స్థాయి 3,369 డాలర్లకు చేరింది.
ఇవి కూడా చదవండి
నీ వయస్సు అయిపోయింది.. అందుకే..
ఆస్తి తగాదా.. యువకుడి హైడ్రామా.. చివరకు ఏమైందంటే
Read Latest AP News And Telugu News