భారత్పై చైనా ‘వాణిజ్య’ యుద్ధం
ABN , Publish Date - Jan 17 , 2025 | 05:35 AM
చైనా.. మన దేశంపై వాణిజ్య యుద్ధం ప్రారంభించింది. మన దేశ ఎలకా్ట్రనిక్స్, విద్యుత్ వాహనాలు (ఈవీ), సౌర విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే సోలార్ మాడ్యూల్స్ తయారీకి...

న్యూఢిల్లీ: చైనా.. మన దేశంపై వాణిజ్య యుద్ధం ప్రారంభించింది. మన దేశ ఎలకా్ట్రనిక్స్, విద్యుత్ వాహనాలు (ఈవీ), సౌర విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే సోలార్ మాడ్యూల్స్ తయారీకి అవసరమైన కీలక ముడి పదార్ధాలు, యంత్రపరికరాల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దీంతో ఈ రంగాలకు చెందిన కంపెనీలు ముడి పదార్ధాలు, యంత్ర పరికరాలు లభించక ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నాయి. తన పెట్టుబడులపై భారత్ విధించిన ఆంక్షలకు ప్రతిగా చైనా ఈ చర్య తీసుకుందని భావిస్తున్నారు. ఈ చర్యలకు బెదిరిపోకుండా జపాన్, దక్షిణ కొరియా దేశాల నుంచి భార త్ ఈ ముడి పదార్ధాలు, యంత్రాలు దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నించాలని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్షియేటివ్ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ సూచించారు.