Share News

6 రోజుల్లో రూ.18 లక్షల కోట్ల నష్టం

ABN , Publish Date - Feb 13 , 2025 | 05:38 AM

వాణిజ్య యుద్ధ భయాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కారణంగా భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా ఆరో రోజూ నష్టాలు చవిచూశాయి. బుధవారం ట్రేడింగ్‌ తొలి గంటలోనే సెన్సెక్స్‌ 905 పాయింట్లు క్షీణించి...

6 రోజుల్లో రూ.18 లక్షల కోట్ల నష్టం

  • మరో 122 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్‌

ముంబై: వాణిజ్య యుద్ధ భయాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కారణంగా భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా ఆరో రోజూ నష్టాలు చవిచూశాయి. బుధవారం ట్రేడింగ్‌ తొలి గంటలోనే సెన్సెక్స్‌ 905 పాయింట్లు క్షీణించి 75,388 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఆర్థిక సేవలు, లోహ రంగాల షేర్లలో కొనుగోళ్లతో సూచీ మళ్లీ తేరుకుని మఽధ్యాహ్నం ఒక దశలో స్వల్ప లాభాల్లో ట్రేడైనప్పటికీ.. ఆయిల్‌, ఐటీ రంగ షేర్లలో అమ్మకాల కారణంగా తిరిగి నష్టాల్లోకి జారుకుంది. చివరికి సెన్సెక్స్‌ 122.52 పాయింట్ల నష్టంతో 76,171.08 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 26.55 పాయింట్లు కోల్పోయి 23,045.25 వద్ద ముగిసింది. గడిచిన ఆరు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 2,412.73 పాయింట్లు (3.07 శాతం), నిఫ్టీ 694 పాయింట్లు (2.92 శాతం) క్షీణించాయి. ఆరు రోజుల్లో రూ.18 లక్షల కోట్ల మార్కెట్‌ సంపద తరిగిపోయింది. దాంతో బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాప్‌ రూ.407.46 లక్షల కోట్లకు (4.69 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..

Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం

Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి

Also Read: మరోసారి కుల గణన సర్వే

Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు

Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 13 , 2025 | 05:38 AM