సొమ్ముల్లేవ్!
ABN , Publish Date - May 09 , 2025 | 12:30 AM
డీసీసీబీ శాఖలోని రైతు ఖాతాలో జమ అయిన సొమ్ము రోజుకు రూ.50 వేల చొప్పున తీసుకోవాల్సి వస్తోంది. అంతే పరిమితి ఉందని సిబ్బంది చెబుతున్నారు.

రైతులకు సహకార బ్యాంక్ ఝలక్
రైతులకు ధాన్యం సొమ్ము చెల్లింపులో పరిమితి
రోజుకు రూ.50 వేలు మాత్రమే
లబోదిబోమంటున్న అన్నదాత
బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు
ధాన్యం విక్రయించిన తాడేపల్లిగూడెం రైతు కోడూరి సత్యనారాయణ ఖాతాలో ప్రభుత్వం రూ.5 లక్షలు జమ చేసింది. డీసీసీబీ తాడేపల్లిగూడెం శాఖలోని సత్యనారాయణ ఖాతాలో సొమ్ములు జమయ్యాయి. రోజుకు రూ.50 వేలు మాత్రమే ఇస్తున్నారు. మూడు రోజుల నుంచి ఆయన బ్యాంకు చుట్టూ తిరుగుతూ రూ.50 వేలు చొప్పున తెచ్చుకుంటున్నాడు.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
డీసీసీబీ శాఖలోని రైతు ఖాతాలో జమ అయిన సొమ్ము రోజుకు రూ.50 వేల చొప్పున తీసుకోవాల్సి వస్తోంది. అంతే పరిమితి ఉందని సిబ్బంది చెబుతున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల వ్యవధిలోనే ప్రభుత్వం సొమ్ము జమ చేసినా రైతులకు అందడం లేదు. వాణిజ్య బ్యాంకుల ఖాతాల నుంచి రైతులకు మొత్తం సొమ్ము సక్రమంగా ఇచ్చేస్తున్నారు.
గతంలో గ్యారెంటీలతో జోష్
జాతీయ బ్యాంకులు, ప్రైవేటు వాణిజ్య బ్యాం కులు గతంలో మిల్లర్లకు బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వడానికి ముందుకు రాలేదు. అప్పట్లో డీసీసీ బీ శాఖలు గ్యారెంటీలు ఇచ్చాయి. గత తెలుగు దేశం హయాంలో మిల్లర్లకు బ్యాంకు గ్యారెం టీలు ఇచ్చే స్థాయిలో డీసీసీబీలు ఉండేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో మిల్లర్లు ఆసక్తి చూపడం లేదు. డీసీసీబీల్లో సేవలు అం తంత మాత్రమేనని మిల్లర్లు వాణిజ్య బ్యాంకు లను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం డీసీసీబీల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తోంది. డీసీసీబీలకు గతంలో మంజూరుచేసిన కమీషన్ ఇందులోనే డిపాజిట్ చేశారు. రూ.100 కోట్ల మేర సొసైటీల సొమ్ములు డీసీసీబీలోనే ఉన్నాయి. ఏటా 8 శాతం వడ్డీని మాత్రమే సొసైటీలకు డీసీసీబీ చెల్లిస్తోంది. డీసీసీబీని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో అప్పటి అధికారులు కమీషన్ సొమ్ము డీసీసీబీ ఖాతాలో జమ చేశారు. తాజాగా రైతులకు ప్రభుత్వం జమ చేస్తున్న సొమ్ములను చెల్లించలేని పరిస్థితి.
20 శాతం సహకార బ్యాంకుల్లోనే జమ
ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యం లో 20 శాతం సొమ్ము జిల్లా కేంద్ర సహకార బ్యాంకు శాఖలలో జమవు తోంది. ఇప్పటి వరకు జిల్లాలో 5.50 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. రైతు ఖాతాల్లో రూ.1150 కోట్లు జమ చేశారు. సహకార బ్యాంక్ శాఖల్లో ఖాతాలున్న 20 శాతం మంది రైతుల కు వాటిలోనే నగదు జమ అయింది. ఇప్పుడిదే రైతుకు శాపంగా మారింది. దీనిపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుని తమకు మేలు జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు.