Share News

మేమున్నామని

ABN , Publish Date - May 10 , 2025 | 12:33 AM

ఆపదలో వున్న మహిళలకు అండగా నిలిచేందుకు.. వారికి భరోసా కల్పించేందుకు వన్‌ స్టాప్‌ సెంటర్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ కేంద్రం ఏలూరులో వుంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాకు భీమవరంలో దీనిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది.

మేమున్నామని

భీమవరంలో ఏర్పాటుకు ప్రభుత్వాస్పత్రి స్థలం కేటాయింపు

ఆపదలో వున్న మహిళలకు అండగా నిలిచేందుకు.. వారికి భరోసా కల్పించేందుకు వన్‌ స్టాప్‌ సెంటర్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ కేంద్రం ఏలూరులో వుంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాకు భీమవరంలో దీనిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఇందుకు ఇక్కడి ప్రభుత్వాసుప త్రిలో ఐదు సెంట్ల స్థలాన్ని కేటాయించా రు. త్వరలో అందుబాటులోకి రానుంది.

(భీమవరం క్రైమ్‌–ఆంధ్రజ్యోతి):

మహిళల రక్షణకు ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే శక్తి టీమ్‌లను ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న బాధిత మహిళలకు న్యాయం జరి గేలా చర్యలు తీసుకుంది. ఆపదలో ఉన్న మహిళలు మొబైల్‌ యాప్‌ ద్వారా సమాచారం ఇచ్చిన కొద్ది నిమిషాల్లోనే వారిని రక్షించేందుకు ఈ టీమ్‌లు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నాయి. అలాగే ఉమ్మడి ఏలూరు వన్‌స్టాప్‌ సెంటర్‌ ఎందరో బాధితులను ఆదుకుంది. జిల్లాల విభజన తర్వాత ఒక్కో జిల్లాలో ఒక్కో కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా భీమవరంలో ఏర్పాటుకు జీవో నెం. 272 ప్రకారం ప్రభుత్వాసుపత్రి క్వార్టర్స్‌ వద్ద ఐదు సెంట్ల స్థలాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కేటాయించింది. ఈ సెంటర్‌లో ఒక ఏవో, ఒక మహిళా ఏఎస్‌ఐ, ఇద్దరు కౌన్సిలర్‌లతోపాటు మహిళా అధికారులు వుంటారు.

ఈ సెంటర్‌ ఎలా పనిచేస్తుంది ?

మహిళలపై జరుగుతున్న వేధింపులు, దాడులు, గృహహింస వంటి కేసుల్లో బాధితులు ఈ కేంద్రా నికి వచ్చి సహాయం పొందవచ్చు. ఇక్కడ వీరికి వైద్య, పోలీసు, న్యాయ, మానసిక సహాయాలు అందుతాయి. బాధిత మహిళకు అవసరమైతే ఆసు పత్రిలో అడ్మిట్‌ చేసి వైద్య సహాయం అందేలా చూ స్తారు. పోలీసులకు సమాచారం అందించి రక్షణగా నిలుస్తారు. లాయర్ల ద్వారా సలహాలు, మానసిక సమస్యలపై కౌన్సెలింగ్‌, తాత్కాలిక ఆశ్రయం కూడా కల్పిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు 181 నెంబర్‌కు, బాలికలు 1098 నెంబరుకు కాల్‌ చేయవ చ్చు. మరిన్ని వివరాలకు.. wdcw.ap.gov.in/ Instituions/OSC వెబ్‌సైట్‌ను చూడండి.

రక్షణ పొందవచ్చు

బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకో లేక ఆత్మహత్యల వంటి అఘాయిత్యాలకు పాల్పడ కుండా ఈ కేంద్రాలను ఆశ్రయించి రక్షణ పొందవ చ్చు. రేప్‌, పోక్సో కేసుల్లో బాధితులకు ఈ సెంటర్లు అండగా నిలుస్తున్నాయి. వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి సహకరిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏదైనా సమస్య వస్తే ఏలూరు వెళ్లాల్సి వచ్చేది. జిల్లావాసులు భీమ వరం కేంద్రం త్వరలోనే అందుబాటులోకి రానుంది.

వన్‌స్టాప్‌ సెంటర్‌ ద్వారా అభయం

‘వన్‌స్టాప్‌ సెంటర్ల ద్వారా ఆపదలో వున్న మహిళలకు యువతులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి వారిలో ఎటువంటి భయం, బాధ లేకుండా చేయడానికే ఎంతో కృషి చేస్తాయి. ఆసుపత్రి క్వార్టర్స్‌ వద్ద ఐదు సెంట్ల స్థలాన్ని కేటాయించాం. త్వరలోనే బాధితులకు ఈ కేంద్రం అందుబాటులోకి వస్తుంది’ అని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెం డెంట్‌ డాక్టర్‌ మాధవి కల్యాణి తెలిపారు.

Updated Date - May 10 , 2025 | 12:33 AM