Share News

‘పీఎం శ్రీ’ పాఠశాలగా పెదతాడేపల్లి గురుకులం

ABN , Publish Date - Jul 20 , 2025 | 12:16 AM

తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 25 గురుకుల పాఠశాలల్లో ‘పీఎం శ్రీ’ ఉత్తమ పాఠశాలగా ఎంపికైంది.

‘పీఎం శ్రీ’ పాఠశాలగా పెదతాడేపల్లి గురుకులం
ప్రిన్సిపాల్‌ రాజారావును అభినందిస్తున్న అధికారులు

తాడేపల్లిగూడెం రూరల్‌, జూలై19(ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 25 గురుకుల పాఠశాలల్లో ‘పీఎం శ్రీ’ ఉత్తమ పాఠశాలగా ఎంపికైంది. ఈమేరకు శనివారం గురుకుల పాఠశాలను ఎంపిక కమిటీ సందర్శించింది. ఈ సందర్భంగా జిల్లా అసిస్టెంట్‌ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌ శ్యాంకుమార్‌ ఉత్తమ పీఎంశ్రీ పాఠశాలగా ఎంపికైనట్టు వివరించారు. పాఠశా లలో కిచెన్‌ గార్డెన్‌, ల్యాబ్‌, కెరీర్‌ గైడెన్స్‌ ల్యాబ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ల్యాబ్‌, డిజిటల్‌ క్లాస్‌రూంలు తదితర అంశాల్లో ఎంపికైనట్టు తెలిపారు. ఈ సంద ర్భంగా ప్రిన్సిపాల్‌ రాజారావును ఎంఈవో వి.హనుమ, పీఎంకే జ్యోతి, ఏఎంవో సుబ్రహ్మణ్యం, పీఎంశ్రీ ఏఈ వీరస్వామి అభినందించారు.

Updated Date - Jul 20 , 2025 | 12:16 AM