‘పీఎం శ్రీ’ పాఠశాలగా పెదతాడేపల్లి గురుకులం
ABN , Publish Date - Jul 20 , 2025 | 12:16 AM
తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 25 గురుకుల పాఠశాలల్లో ‘పీఎం శ్రీ’ ఉత్తమ పాఠశాలగా ఎంపికైంది.
తాడేపల్లిగూడెం రూరల్, జూలై19(ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 25 గురుకుల పాఠశాలల్లో ‘పీఎం శ్రీ’ ఉత్తమ పాఠశాలగా ఎంపికైంది. ఈమేరకు శనివారం గురుకుల పాఠశాలను ఎంపిక కమిటీ సందర్శించింది. ఈ సందర్భంగా జిల్లా అసిస్టెంట్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ శ్యాంకుమార్ ఉత్తమ పీఎంశ్రీ పాఠశాలగా ఎంపికైనట్టు వివరించారు. పాఠశా లలో కిచెన్ గార్డెన్, ల్యాబ్, కెరీర్ గైడెన్స్ ల్యాబ్, ఫుడ్ ప్రాసెసింగ్, ల్యాబ్, డిజిటల్ క్లాస్రూంలు తదితర అంశాల్లో ఎంపికైనట్టు తెలిపారు. ఈ సంద ర్భంగా ప్రిన్సిపాల్ రాజారావును ఎంఈవో వి.హనుమ, పీఎంకే జ్యోతి, ఏఎంవో సుబ్రహ్మణ్యం, పీఎంశ్రీ ఏఈ వీరస్వామి అభినందించారు.