నీటిచౌర్యం!
ABN , Publish Date - May 10 , 2025 | 12:48 AM
పోలవరం మండలంలో పట్టిసీమ వద్ద నిర్మించిన పట్టిసీమ మేజర్ ఎత్తిపోతల పథకం నుంచి నీటి విడు దల లేకపోవడంతో కొందరు స్థానిక రైతులు సాగునీటి అవసరాల కోసం అడ్డదారుల తొక్కుతున్నారు.

పట్టిసీమ పైపుల బోల్టులు ఊడదీసి.. మోటార్లతో తోడేస్తున్నారు
సాగునీటి కోసం కొందరు రైతుల అడ్డదారులు
ఏటా పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు
పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేసిన నిర్వాహకులు
పోలవరం, మే 9 : పోలవరం మండలంలో పట్టిసీమ వద్ద నిర్మించిన పట్టిసీమ మేజర్ ఎత్తిపోతల పథకం నుంచి నీటి విడు దల లేకపోవడంతో కొందరు స్థానిక రైతులు సాగునీటి అవసరాల కోసం అడ్డదారుల తొక్కుతున్నారు. దీనివల్ల పట్టిసీమ మేజర్ ఎత్తిపోతల పథకం నిర్వహణ కాంట్రాక్టర్లు ఏటా పైపులైన్ల మర మ్మతులు చేపట్టాల్సి వస్తోంది.
గతంలో టీడీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు గోదావరి జలాలు పంపిణీ చేయడానికి పట్టిసీమ ఎత్తిపోతల పథ కం నుంచి ఇటుకలకోట డెలివరీ ఛానల్ వరకు 3.995 కిలోమీటర్ల మేర భారీ పైపులైన్లు ఏర్పాటు చేశారు. ఆ పైపులైన్లకు పలుచోట్ల ఎయిర్వాల్లను ఏర్పాటు చేశారు. అత్యవసర సందర్భాల్లో ఎయిర్ వాల్వ్ మూతలు తీసేలా భారీ ప్లాంజ్లు వేసి బోల్టులు బిగించారు. గత రెండేళ్లుగా మార్చి, ఏప్రిల్ నెలల్లో వరి, మొక్క జొన్న, అపరా ల పంటలకు గోదావరిలో నీటిమట్టం 14 మీటర్లకు తక్కువగా ఉండడం వల్ల పట్టిసీమ నుంచి అధికారులు నీటి సరఫరా చేయలేదు. దీంతో కొందరు రైతులు ఎయిర్వాల్వ్ పైపులైన్ల ప్లాంజ్ బోల్టులు ఊడదీసి ఆపైపుల నుంచి మోటార్ల ద్వారా నీటిని తోడి సాగు నీటికి ఉపయోగిస్తు న్నారు. ఈ క్రమంలో బోల్టులు బిగించకుండా వదిలివేయడం, గ్యాస్కట్లు తెగిపోయి లీకేజీలు కావడం వల్ల ప్లాంజ్లు ఊడి నీటి పంపిణీ సమయాల్లో పైపుల నుంచి ఫౌంటేన్లా ఎగజిమ్ముతున్నాయి. వాటికి మరమ్మతులు చేయడం ఎత్తిపోతల పథకం నిర్వాహకులకు అదనపు వ్యయంతో పాటు అదనపు శ్రమతో కూడుకున్న వ్యవహారంగా మారింది. గతేడాది జూన్ ఆరో తేదీన ఇదే విధంగా ప్లాంజ్ లీకై జలాలు వృఽథాగా పోయాయి.
జూ ఈ ఏడాది 25 ప్రాంతాల్లో..
ఈ ఏడాది కూడా సాగు నీటి కోసం రైతులు 25 ప్రాంతా ల్లో ఎయిర్వాల్ ప్లాంజ్ బోల్టులు పీకి నీటిని తోడి వదిలివేసి నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో, జలవనరుల శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు నిర్వాహక సంస్థ ప్రతినిధి రాజు తెలిపారు. ప్రస్తుతం మరమ్మ తులు చేపట్టామని, సమస్యలు తలెత్తిన ప్రాంతంలో మెషీన్లతో పనులు చేయించాల్సి ఉంటుందని, కొత్తబోల్టులు, గ్యాస్కట్లు వాడాల్సి ఉంటుంద న్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటే ఈ సమస్య పునరావృతం కాకుండా ఉంటుందని కోరుతున్నారు. దీనిపై పట్టిసీమ ఎత్తిపోతల పథకం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పెద్దిరాజుని వివరణ కోరగా ఏటా రైతులు సాగు నీటి అవసరాలకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, రైతులను సమావేశ పరచి అవగాహన కల్పించడం, పోలీసు సహాయంతో కౌన్సెలింగ్ ఇప్పించడం ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.