Share News

నామినేటెడ్‌ నిరీక్షణ

ABN , Publish Date - May 10 , 2025 | 12:20 AM

తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టి ఏడాదికి చేరువవుతోంది. ఇప్పటి వరకు నామినేటెడ్‌ స్థాయిలో కొందరికే అవకాశం ఇచ్చారు. ఈ పార్టీ కోసం నిర్విరామంగా కష్టించడమే కాకుండా గడిచిన ఐదేళ్లలో జగన్‌ జమానాలో అక్రమ కేసులతోపాటు ప్రత్యక్ష, పరోక్ష బెదిరింపులు ఎదుర్కొన్న వారందరికీ అధికారంలోకి రాగానే నామినేటెడ్‌ పదవులు ఇస్తామన్నారు.

నామినేటెడ్‌ నిరీక్షణ

ఇంకా భర్తీ కాని పదవులు

మార్కెట్‌ కమిటీలకు దిక్కులేదు

సొసైటీ త్రిసభ్య కమిటీలను తేల్చలేదు

జిల్లా, రాష్ట్రస్థాయి కార్పొరేషన్లదీ ఇదే పరిస్థితి

అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా నాన్చుడే

ఇదేనా గుర్తింపు అంటూ టీడీపీ కేడర్‌ కస్సుబుస్సు

జనసేన, బీజేపీలోనూ ఎదురుచూపులు

తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టి ఏడాదికి చేరువవుతోంది. ఇప్పటి వరకు నామినేటెడ్‌ స్థాయిలో కొందరికే అవకాశం ఇచ్చారు. ఈ పార్టీ కోసం నిర్విరామంగా కష్టించడమే కాకుండా గడిచిన ఐదేళ్లలో జగన్‌ జమానాలో అక్రమ కేసులతోపాటు ప్రత్యక్ష, పరోక్ష బెదిరింపులు ఎదుర్కొన్న వారందరికీ అధికారంలోకి రాగానే నామినేటెడ్‌ పదవులు ఇస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు కొందరికే అవకాశం ఇచ్చారు. క్షేత్రస్థాయిలో కేడర్‌ కోరుకుంటున్న సొసైటీల త్రిసభ్య కమిటీల్లో, దేవాలయ కమిటీల్లో, మార్కెట్‌ కమిటీల్లో చోటు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారు. కార్పొరేషన్‌లో కొందరికి అవకాశం ఇచ్చి మరి కొందరిని విస్మరించారు. నామినేటెడ్‌ గౌరవం కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్న వారంతా ఇంకా ఎప్పుడు ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

డీసీసీబీ.. డీసీఎంఎస్‌ ఖాయమే!

డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఈ రెండు ఉమ్మడి జిల్లాలోనే ఉన్నాయి. ఈ రెండింటికి చైర్మన్‌తోపాటు పూర్తిస్థాయి కమిటీని నామినేట్‌ చేయాల్సి ఉంది. మిగతా జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తి అయినా ఉమ్మడి పశ్చిమలో సర్దుబాటు పేరిట జాప్యం జరుగుతోంది. ఏలూరు జిల్లాకు చెందిన టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులుకు ఆప్కో చైర్మన్‌ ఇస్తామని సంకేతాలు పంపారు. దీనికి అనుగుణంగా ఆయన ఏలూరు డీసీసీబీ చైర్మన్‌గా నామినేటెడ్‌ కావాలి. ఐదారు రోజుల క్రితం మిగతా జిల్లాల కమిటీలను ప్రకటించారు. ఉభయ గోదావరి, ఉమ్మడి జిల్లాలకు ఈ జాబితాలో చోటు దక్కలేదు. డీసీసీబీ టీడీపీకి కేటాయిస్తే డీసీఎంఎస్‌ జనసేనకు కేటాయించాలని భావించారు. డీసీసీబీ చైర్మన్‌గా గన్ని, డీసీఎంఎస్‌ చైర్మన్‌గా కొటికలపూడి గోవిందరావు(చినబాబు)ల పేర్లు ఖరారయ్యాయని సమాచారం. నేడో రేపో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

కేడర్‌లో ఆగ్రహం, అసంతృప్తి

జగన్‌ ప్రభుత్వ హయాంలో సహకార సంఘాలను త్రిసభ్య కమిటీలతో నిర్వహిస్తూ వచ్చారు. ఇప్పట్లో సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలు లేకపోవడంతో త్రిసభ్య కమిటీ లతో సరిపెట్టాలని టీడీపీ యోచించింది. వివిధ సంఘాల్లో త్రిసభ్య కమిటీలతో జాబితాలను ఎమ్మెల్యేలు సిద్ధం చేసి పంపారు. బీజేపీ, జనసేనలకు పలు సంఘాల్లో చోటు ఇచ్చారు. గ్రామ, నియోజకవర్గ స్థాయిల్లో త్రిసభ్య కమిటీల మీదే అత్యధికులు ఆసక్తిగా ఉన్నప్పటికి అధికార ప్రకటనలు జాప్యం కావడం కిందిస్థాయి మూడు పార్టీల కేడర్‌లో ఆగ్రహం, ఆసంతృప్తి కలిగిస్తోంది. ఎమ్మెల్యేలు కేడర్‌ నుంచి ఎదురవుతున్న ఒత్తిడిలతో నలిగిపోతున్నారు.

రాష్ట్రస్థాయి పదవుల కోసం మరికొందరు..

రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌లో చాలా వరకు భర్తీ చేసినా.. చాలా వరకు పెండింగ్‌లో వున్నాయి. వీటి కోసమే ఆశావహులు ఆరాట పడుతున్నారు. ఏలూరు పట్టణాభివృద్ధి సంస్థ(ఈడా)లో నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి జాప్యం కొనసాగుతోంది. ఉమ్మడి పశ్చిమలో మూడొంతుల మండలాలు ఈడా పరిధిలోకి వస్తాయి. వివిధ నిర్మాణా లకు ఈడానే అనుమ తులివ్వాలి. గత వైసీపీ ప్రభుత్వ

హయాంలో ఈడా చైర్మన్‌గా సీనియర్‌ నేత ఎంఆర్‌డీ బలరాం సతీమణి మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ మధ్యాహ్నపు ఈశ్వరి, బొద్దాని శ్రీనివాస్‌ కొనసాగారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడా పదవి కోసం అనేకమంది ఆశపడ్డారు. ఒకప్పుడు వైసీపీలో వున్న ఎంఆర్‌డీ బలరాం దంపతులు, బొద్దాని శ్రీనివాస్‌ ఇప్పుడు టీడీపీలో కొనసాగుతున్నారు. మరోసారి తమ కుటుంబానికి అవకాశం ఇవ్వాల ని బలరాం ఆశిస్తూ వచ్చారు. నామినేటెడ్‌ పదవి విషయంలో ఎమ్మె ల్యేల సిఫార్సులు పరిగణనలోకి తీసుకునేవారు. కానీ ఇప్పుడు నామి నేటెడ్‌ పదవుల్లో సామాజికవర్గాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఎంపిక చేస్తూ వస్తున్నారు. ఈ కారణంగా పేర్లు సిఫార్సు వరకే ఎమ్మెల్యేలు పరిమితమయ్యారు. మిగిలిన వ్యవహారమంతా టీడీపీ అధిష్ఠానం చూసుకుంటోంది. జనసేన, బీజేపీలు కొన్ని నియోజకవ ర్గాల్లో తమ పార్టీ పక్షాన నామినేటెడ్‌ పదవుల్లో చోటు కల్పించాల్సిం దిగా సమన్వయ కమిటీ సమావేశాల్లో జాబితాలు ఇచ్చాయి.

పూర్తిస్థాయిలో భర్తీ కాని మార్కెట్‌ కమిటీలు

ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మార్కెట్‌ కమిటీలను పూర్తిస్థాయిలో ఇప్పటికీ భర్తీ చేయలేదు. రిజర్వేషన్లు, నియోజకవర్గ స్థాయిలో బలమైన నేతలు, కార్యకర్తలు మహిళల నుంచే ఎంపిక చేయడానికే ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ఈ కారణంగా అధికారంలోకి వచ్చినా

మార్కెట్‌ కమిటీలను పూర్తిగా వేయలేకపోతున్నారంటూ ఎమ్మెల్యేల పై కార్యకర్తలు ఫైర్‌ అవుతున్నారు. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోను మార్కెట్‌ కమిటీలు భర్తీ కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పశ్చిమగోదావరిలో పది మార్కెట్‌ కమిటీలకు నాలుగు, ఏలూరు జిల్లాలో తొమ్మిదింటికి మూడు మార్కెట్‌ కమిటీలను మాత్రమే నామినేటెడ్‌ చేయగలిగారు. మిగతా వాటి విషయంలో రెండున్నర నెలల నుంచి కసరత్తు పేరిట సాగదీస్తున్నారు. 200లకు పైగా దేవాలయ కమిటీలను నామినేటెడ్‌ దిశగా జీవోతో కాస్తా కదలిక వచ్చింది. గుర్తించిన దేవాలయాల్లో స్థానిక నేతలకు అవకాశం ఇచ్చేందుకు ఇది దోహదపడుతోంది.

ఎన్నికలు పూర్తి అయిన తర్వాత జనం మెచ్చే విధంగా మిమ్మల్ని గుర్తిస్తామంటూ పార్టీ నేతలకు, కార్యకర్తలకు టీడీపీ అధినేత చంద్ర బాబు, లోకేశ్‌ ఇచ్చిన హామీలను గుర్తు చేసుకుంటూ మదనపడిపో తున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి సుమారు 100 మంది వరకు ముఖ్యనేతలు, కార్యకర్తలు నామినేటెడ్‌ పదవులను ఆశిస్తూ పార్టీకి దరఖాస్తు చేసుకుంటున్నారు. తీరా భర్తీ విషయంలో జాప్యం కొనసా గడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ప్రత్యేకించి తమకు అన్యాయం జరు గుతోందని మహిళా నేతలు దిగాలు పడ్డారు.

ఎదురుచూపు నేతలు

భీమవరం నియోజకవర్గంలో నిర్విరామంగా కష్టపడుతున్న టీడీపీ నేత కోళ్ల నాగేశ్వరరావు తనకు నామినేటెడ్‌ పదవి ఖాయమనే ధీమాతో ఉండేవారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ పదవుల్లో ఏదో ఒకటి తనకి దక్కకపోతుందా అని ఆశించారు. నామిటెడ్‌ పోస్టుల్లో ఏదో ఛాన్సు లభిస్తుందని కొత్తూరి బాపిరాజు, ఇందుకూరి రామకృష్ణంరాజు, మెరగాని నారాయణమ్మ, నెహ్రూ జనసేనకు చెందిన నేతలంతా ఉన్నారు. ఏలూరులో సీనియర్‌ నేత ఎంఆర్‌డీ బలరాం, మధ్యాహ్నపు ఈశ్వరి, కంప్యూటర్‌ ప్రసాద్‌, కడియాల విజయలక్ష్మి, కొల్లేపల్లి రాజు వంటి ముఖ్య నేతలపై నామినేటెడ్‌ ప్రచారం సాగుతోంది. చింతలపూడి నియోజకవర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యాంచంద్రశేషు బీసీ వర్గాల నుంచి ఏదో ఒక అవకాశాన్ని కోరుకుంటున్నారు. పార్టీ ముఖ్యు లతోపాటు సీఎం చంద్రబాబు, యువనేత లోకేశ్‌ వంటి వారిని పలుమార్లు కలిసి తనకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. నూజివీడు, కైకలూరులో పార్టీలోని సీనియర్లు అంతా పలుమార్లు పార్టీలో రాష్ట్రస్థాయి నేతలకు తమగోడు వెళ్లబోస్తున్నారు. నరసాపురంలో డాక్టర్‌ రాజ్యలక్ష్మి, కొల్లు పెద్దిరాజు, కొప్పాడ రవి, ఆచంటలో గొడవర్తి శ్రీరాములు, తణుకులో దొమ్మేటి వెంక టసుధాకర్‌ వంటి వారంతా నామినేటెడ్‌ లిస్టులో తమకు గౌరవం దక్కుతుం దన్న అంచనాల్లో వున్నారు. తాడేపల్లిగూడెంలో పరిమి రవికుమార్‌, వాడపల్లి వెంకటసుబ్బరాజు, దాసరి అప్పన్న, పాతూరి రాంప్రసాద్‌చౌదరి వంటి వారు పోలవరంలో మేఘాలాదేవితోపాటు ఒక అరడజను నేతలు ఆశలు పెంచుకు న్నారు. జనసేన, బీజేపీ పక్షాన సైతం కొందరి పేర్లు తెరముందుకు వచ్చినా జాబితాలో చోటు ఎంత వరకూ దక్కుతుందనేది అనుమానంగానే ఉంది.

Updated Date - May 10 , 2025 | 12:21 AM