Share News

వరద నీటిలో నత్తా రామేశ్వరస్వామి ఆలయం

ABN , Publish Date - Aug 17 , 2025 | 12:46 AM

నత్తా రామేశ్వరంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం రామేశ్వర స్వామి ఆలయం వరద నీటితో ముంపునకు గురైంది.

వరద నీటిలో నత్తా రామేశ్వరస్వామి ఆలయం
నత్తారామేశ్వరస్వామి ఆలయంలోకి చేరిన వరద నీరు

పెనుమంట్ర, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): నత్తా రామేశ్వరంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం రామేశ్వర స్వామి ఆలయం వరద నీటితో ముంపునకు గురైంది. రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోస్తనీ నది పోటెత్తింది. ఈమేకు ఆలయ ప్రాంగణంలోకి వరద నీరు వచ్చి చేరింది. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు మోకాళ్ల లోతు నీటిలో నుంచి వెళ్లి స్వామిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు వరద నీరు ఆలయ ప్రాంగణానికి వచ్చి చేరడంతో అవస్థలు పడుతున్నారు.

Updated Date - Aug 17 , 2025 | 12:46 AM