Share News

ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన సేవలందించండి

ABN , Publish Date - May 10 , 2025 | 12:37 AM

జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధా న కార్యదర్శి ఎంటి కృష్ణబాబు వైద్యాధికారులను ఆదేశిం చారు.

ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన సేవలందించండి
వైద్య కళాశాల భవనాలను పరిశీలిస్తున్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు

ఏలూరు జిల్లా ఆస్పత్రిలో వైద్య ఆరోగ్య శాఖ సీఎస్‌ కృష్ణబాబు

వైద్య కళాశాల భవన నిర్మాణ పనుల పరిశీలన

ఏలూరు క్రైం, మే 9 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధా న కార్యదర్శి ఎంటి కృష్ణబాబు వైద్యాధికారులను ఆదేశిం చారు. ప్రభుత్వ వైద్యకళాశాల భవనాల నిర్మాణ పను లను పరిశీలించేందుకు శుక్రవారం ఏలూరు వచ్చారు. ఎమ్మెల్యే బడేటి చంటి ఆయనను కలిసి ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత, వైద్య పరికరాలు కొరత వివ రించారు. వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి కలెక్టర్‌ సూచనల మేరకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌, వైద్య కళాశాల ప్రిన్సి పాల్‌ను కృష్ణబాబు ఆదేశించారు. అవసరమైన వైద్య పరికరాల కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. ఆప రేషన్‌ థియేటర్‌లో శస్త్ర చికిత్సకు అత్యవసర పరికరాలు ఆసుపత్రి అభివృద్ధి నిధుల నుంచి కలెక్టర్‌ అనుమతితో కొనుగోలు చేయాలన్నారు. ఇతర ఆసుపత్రులలో పని చేసే రేడియోలజిస్టులను గంటల ప్రాతిపదికన తాత్కాలికంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఎన్టీఆర్‌ వైద్య సేవ ద్వారా అధికంగా శస్త్ర చికిత్సలు జరిగేలా వైద్యులు చూడాలన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని, సీసీ కెమెరాల ద్వారా వైద్య సిబ్బం ది పనితీరును పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

సౌకర్యవంతమైన వసతి గృహాలు నిర్మించాలి

ప్రభుత్వ వైద్యకళాశాల విద్యార్థు లకు సౌకర్యవంతమైన వసతి గృహాలు నిర్మించాలని కృష్ణబాబు అధికారులను ఆదేశించారు. సంక్షేమ వసతి గృహాల సముదాయం, ప్రభుత్వ వైద్య కళాశాల భవనా ల నిర్మాణ పనులను కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి, వైద్య విద్య సంచాలకుడు నరసింహం, ఏడీ వెంకటేశ్‌, ఎమ్మెల్యే బడే టి చంటి, అధికారులతో కలిసి కృష్ణబాబు పరిశీలించారు. రానున్న రోజులలో వైద్య కళాశాలలో అండర్‌ గ్రాడ్యుయే ట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, వివిధ వైద్య విభాలలో స్పెషలిస్ట్‌ కోర్సులు 750 మందిపైగా అభ్యసిస్తారని, ప్రస్తుతం ఉన్న భవనాలకు అదనంగా హాస్టల్‌ భవనాలు నిర్మిం చేందుకు ప్రతిపాదనలు పంపాలన్నారు. వసతి గృహ భవనాలు వైద్యకళాశాలకు దగ్గరలో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. హాస్టల్‌ నిర్మాణానికి స్థలం వివరాలను అధికారులు స్పెషల్‌ సీఎస్‌కు వివరించారు. అనంతరం ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను కృష్ణబాబు స్వయంగా పరిశీలించారు.

జిల్లా వైద్యాధికారి మాలిని, డీసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ పాల్‌ సతీష్‌, ఆర్డీవో అచ్యుత అంబరీష్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ముక్కంటి, వైద్యారోగ్యశాఖ మౌలిక సదుపాయల అభివృద్ధి సంస్థ చీఫ్‌ ఇంజనీర్‌ కె.శ్రీనివాస్‌, ఎస్‌ఈ బలరాంరెడ్డి, ఈఈ రాజబాబు, ఏలూరు తహసీల్దార్‌ శేషగిరిరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2025 | 12:37 AM