రేపటి నుంచి ఇంజనీరింగ్ సిబ్బంది సమ్మెలోకి
ABN , Publish Date - Jun 21 , 2025 | 12:46 AM
న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ మునిసిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది కొద్దిరోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు.
నరసాపురం టౌన్, జూన్ 20(ఆంధ్రజ్యోతి): న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ మునిసిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది కొద్దిరోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాక పోవడంతో ఆదివారం నుంచి సమ్మెబాట పట్టనున్నారు. ఈమేరకు శుక్రవారం విప్ నాయకర్, చైర్పర్సన్ వెంకట రమణ, కమిషనర్ అంజయ్యకు సమ్మె నోటీస్ అందిం చారు. సోమవారం నుంచి మునిసిపల్ కార్యాలయం ఎదుట టెంట్వేసి నిరవధిక దీక్ష చేపడతామని జేఏసీ నాయకులు తెలిపారు. కె.రత్నం, ఫణి సత్యనారాయణ, పార్థు, వెంకటకృష్ణ, బ్రహ్మాజీ, రామకృష్ణ, మధు, ఆను, రాజు, శ్రీను, కాశీ పాల్గొన్నారు.