Share News

మృత్యుఘోష

ABN , Publish Date - May 09 , 2025 | 12:12 AM

జిల్లాలోని పేరుపాలెం సాగర తీరం పేరుపాలెం బీచ్‌ ప్రమాదాలకు నిలయంగా మారింది. ఆహ్లాదకర వాతావరణం, ప్రకృతి రమణీయత, సముద్ర అలలు, తీరం వెంబడి కొబ్బరి, సరుగుడు తోటలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి.

మృత్యుఘోష

సాగర తీరంలో పొంచివున్న మృత్యువు

సముద్రంలో కలిసిపోతున్న నిండు జీవితాలు

2 నెలల్లో 10 మందిని మింగిన కడలి

కొరవడిన నిరంతర పర్యవేక్షణ

జిల్లాలోని పేరుపాలెం సాగర తీరం పేరుపాలెం బీచ్‌ ప్రమాదాలకు నిలయంగా మారింది. ఆహ్లాదకర వాతావరణం, ప్రకృతి రమణీయత, సముద్ర అలలు, తీరం వెంబడి కొబ్బరి, సరుగుడు తోటలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. పలు ప్రాంతాల నుంచి యువకులు, మహిళలతో పాటు కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం పరిపాటి. సముద్రంలో స్నానానికి దిగిన యువకులు అలల ఉధృతికి కొట్టుకుపోయి విగత జీవులుగా తీరానికి చేరడం విషాదం నింపుతోంది.

మొగల్తూరు, మే8(ఆంధ్రజ్యోతి): సముద్రం స్నానానికి అనువుగా లేకున్నా ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అలలను చూసి ఉత్సాహంతో ఎదురెళ్లిన వారి ఊపిరి కలిసిన అలలు మధ్య మృత్యు ఘోష వినిపిస్తున్నాయి.

రెండు నెలల్లో పది మంది మృత్యువాత

సముద్ర స్నానానికి దిగిన వారిలో యువకులు ఎక్కు వగా మృత్యువాత పడుతున్నారు. గత ఏడేళ్లలో అలల ఉధృ తికి కొట్టుకుపోయినవారిలో 50 మంది పైగానే మృత్యువాత పడ్డారు. 2015లో ఆరుగురు, 2016లో ఇద్దరు, 2017లో ముగ్గురు, 2018లో ఎనిమిది మంది, 2019లో ఐదుగురు, 2020లో ముగ్గురు, 2021లో నలుగురు, 2022లో నలుగురు, 2023లో ముగ్గురు, 2024లో నలుగురు మృతి చెందారు. గత రెండు నెలల్లో పది మంది యువకులు గల్లంతై మృతి చెందినట్టు పోలీస్‌ రికార్డుల్లో నమోదైంది.

19 కిలో మీటర్ల తీర ప్రాంతం

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 19 కిలో మీటర్ల సాగర తీరం మొగల్తూరు, నరసాపురం మండలాల్లో ఉంది. మొగల్తూరు మండలం పేరుపాలెం, కేపీ.పాలెం తీర ప్రాంతంలో కొబ్బరి, సరుగుడు తోటలతో పాటు ఆలయాలు వెలిశాయి. సందర్శకుల సంఖ్య పెరిగి ఈ రెండు గ్రామాల తీరంలో పర్యాకట శోభ సంతరించుకుంది. కేపీ.పాలెంలో మూడు దశాబ్దాల క్రితం క్రైస్తవుల ఆరాధ్యదేవత వేళాంకిణి మాత ఆలయాన్ని నిర్మించారు. అనంతరం వేంకటేశ్వర స్వామి, రుక్మాబాయి సమేత పాండురంగస్వామి, మోళ్లపర్రులో 54 అడుగుల అభయాంజనేయస్వామి, షిరిడీ సాయి ఆలయం, దశావతార మత్యనారాయణస్వామి ఆలయాల నిర్మాణంతో తీర ప్రాంతం ఆధ్యాత్మిక చింతనకు నెలవుగా ఉంది. ఏటా మే నెలలో నాలుగు రోజులు పాటు వేళాంకిణి మాత ఉత్సవాలు, గుడ్‌ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరుగుతాయి. కార్తీక మాసంలో వేంకటేశ్వరస్వామి కల్యాణం, పాండురంగస్వామి కల్యాణం నిర్వహిస్తున్నారు. దీనితో ఇక్కడి తీర ప్రాంతంలో సౌకర్యాలు లేకపోయినా, సముద్ర స్నానానికి అనువుగా లేకున్నా సందర్శకులు తరలివస్తున్నారు. కార్తీక మాసంలో నెల రోజులు పాటు వేలాది మంది పర్యాటకులు సముద్రస్నానం చేసి, ఆలయాలను దర్శించుకుని కొబ్బరి, సరుగుడు తోటల్లో వన భోజనాలు చేస్తుం టారు. ఏటా వేలాది మంది భక్తులు వస్తున్నా సౌకర్యాలు అంతంత మాత్రం.

కన్నీటి కడలి

సముద్రంలో స్నానానికి దిగి గల్లంతై విగత జీవులుగా కొట్టుకువచ్చిన వారి బంధువుల వేదన వర్ణనాతీతం. ప్రాణాలతో పాటు అయినవారి కన్నీరు సైతం కడలిలో కలుస్తోంది. తల్లితండ్రులకు ఆసరాగా నిలవాల్సిన యువకులు అలల ఉధృతిలో కొట్టుకుపోయి కడలిలో కలిసిపోతున్నారు. చేతికి అందివచ్చిన తనయుల కట్టె కడలి ఒడ్డున తేలడంతో బాధిత కుటుంబం బరువెక్కిన హృదయాలతో వెనుదిరుగుతున్నారు.

పేరుపాలెం తీరం అనువు కాదు

సముద్రంలో దిగిన వారి పాదం కింద భాగంలో గొయ్యి కింద ఏర్పడు తుంది. నీటితో కలిసిన ఇసుకలో పాదం మోపగానే కాలి కింద ఇసుక కోతతో నెమ్మదిగా ఒరిగిపోవడం సహజం. అదే అనుభూతితో చాలా మంది ఉత్సా హంగా చిందులేస్తారు. అయితే మద్యం మత్తులో ఉన్నవారు బ్యాలెన్స్‌ చేసుకోలేక అలల ఉధృతికి కొట్టుకుపోతారు. అంతేకాదు స్నేహితులతో బంతి ఆటలు, పరుగులతో కొందరు అలలల కౌగిలికి చిక్కుతారు. కార్తీక మాసంలో మాత్రమే రెవెన్యూ, పోలీస్‌ సిబ్బంది పర్యవేక్షణ, గజ ఈత గాళ్లను ఉంచి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడతారు. మిగిలిన రోజుల్లో పర్యవేక్షణ కొరవడుతోంది. సముద్రం వద్దకు వచ్చిన పలువురు యువకులు తీరం వెంబడి బైక్‌ విన్యాసాలు, మద్యపానం, ఆడపిల్లలతో ఆకతాయు పనులతో సరదా చేస్తు న్నారు. కార్తీక మాసం మినహా మిగిలిన రోజుల్లో అడ్డు అదుపు లేకపోవడంతో యువకులు మరింత స్వేచ్ఛగా వ్యవహరించడంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పుట్టిన రోజు, కాలేజీలు సెలవు రోజుల్లో బీచ్‌కు వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నారు.

కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుచేశాం

పేరుపాలెం బీచ్‌లో కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటుచేసి సిబ్బం దిని అందుబాటులో ఉంచుతున్నాం. వారాంతపు సెలవులు, పండుగ రోజుల్లో ఎక్కువ మంది సిబ్బంది తీరంలో బందో బస్త్‌ విధులు నిర్వహిస్తున్నారు. సముద్ర స్నానానికి దిగే వారికి అవగాహన కల్పించి రక్షణ చర్యలు తీసుంటున్నా ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతర్వేది మెరైన్‌ పోలీసులు తీరం వెంబడి హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసి సందర్శకులను అప్రమత్తం చేశారు.

– జి.వాసు, ఎస్‌ఐ మొగల్తూరు

Updated Date - May 09 , 2025 | 12:12 AM