Share News

రైతన్నకు అండగా..

ABN , Publish Date - May 09 , 2025 | 12:29 AM

ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెలలోనే అమలు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించ డంతో జిల్లా వ్యాప్తంగా అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

రైతన్నకు అండగా..

అన్నదాత సుఖీభవ పథకం అమలుకు గ్రీన్‌సిగ్నల్‌

ఈనెల 20వ తేదీ లోగా అర్హుల గుర్తింపు

కౌలు రైతులకూ పథకం వర్తింపు.. సీసీఆర్‌సీ కార్డుల జారీ ప్రక్రియ

పీఎం కిసాన్‌తో కలిపి ప్రతి రైతుకు రూ.20 వేలు

ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు

ఏలూరు సిటీ, మే 8(ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెలలోనే అమలు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించ డంతో జిల్లా వ్యాప్తంగా అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అన్నదాత సుభీభవ పథకాన్ని అమలు చేసి, కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా సొంత భూమిగల భూ యజమానుల్లో అర్హులను గుర్తించనున్నారు. ఈ మేరకు సొంత భూములు కలిగిన భూ యజమా నుల పేర్లతో ఉన్న జాబితాలను ప్రభుత్వం జిల్లాలకు పంపించింది. ఈ జాబితాలో అర్హులైన రైతులను గుర్తించాలని ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా అందుకున్న అన్నదాతల జాబితాలో వడపోతకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అర్హుల గుర్తింపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా లాగిన్‌లు కేటాయించింది.

అర్హుల గుర్తింపు ఇలా..

సొంత భూములు కలిగిన భూ యజమానుల్లో అర్హుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం అయింది. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్రప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు. రిటైర్డ్‌ ఉద్యో గులలో నెలకు రూ.10 వేలు దాటి పింఛన్‌ పొందే వారు అనర్హులు. ఆక్వా సాగు చేసే రైతులకు ఈ పథకం వర్తిం చదు. ఇన్‌ కంటాక్స్‌ కడుతున్న వారికి వర్తించదు.

కౌలు రైతులకూ అండగా

అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతు లకు వర్తింప జేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. రెండు లక్షల మంది వరకు జిల్లాలో కౌలు రైతులు ఉన్నా గతేడాది 68 వేలు మంది మాత్రమే కౌలు రుణ అర్హత కార్డులను పొం దారు. ఈ ఏడా ది ఈ సీసీఆర్‌సీ కార్డుల జారీ లక్ష్యాన్ని 75 వేల వరకు పెంచారు. కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైం ది. రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి కౌలు రైతుకు రూ.20 వేల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ప్రస్తు తం జరుగుతున్న సొంత భూములు కలిగిన భూ యజమానుల గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత సీసీఆర్‌సీ కార్డు దారు లందరికీ ఈ పథకాన్ని ఈ నెలలోనే వర్తింపజేస్తారని తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రకరకాల సాకులతో అర్హులైన కౌలు రైతులను పక్కనబెట్టారు. టీడీపీ ప్రభుత్వం మాత్రం అర్హులైన ప్రతి కౌలు రైతుకు ఈ పథకం వర్తింపజేయాలని నిర్ణయించింది.

అన్నదాతకు పండగే

అన్నదాత సుఖీభవ పథకాన్ని త్వరితగతిన అమ లు చేయడం వల్ల వారి కుటుంబాల్లో పండుగ వాతా వరణం కనబడుతోంది. రైతు భరోసా పేరుతో గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు జగన్‌ ప్రభుత్వం తూట్లు పొడిచి కేంద్ర ప్రభుత్వ వాటాతో కలిపి కేవ లం రూ.13,500 మాత్రమే ఇచ్చి చేతులు దులి పేసు కుంది. ఈ నేపథ్యంలో రైతులకు అండగా చంద్ర బాబు అర్హులైన ప్రతి రైతుకు రూ.20 వేలు సాయం అందిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల హామీలను ఒక్కొ క్కటి అమలు చేస్తున్న ప్రభుత్వం అన్నదాత సుఖీ భవ పథకాన్ని ఈనెలలోనే అమలు చేసేందుకు నిధులను కేటాయించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్నదాతల్లో ఆనందాన్ని కలిగిస్తోంది.

సొంత భూమి రైతులు 3.80 లక్షలు

జిల్లాకు సంబంధించి 3.80 లక్షల మంది రైతుల పేర్లతో జాబితా వచ్చింది. ఇందులో ప్రభుత్వ విధివిధానాల ప్రకారం అర్హులను మండల స్థాయిలో గుర్తిస్తారు. ఈనెల 20వ తేదీలోగా అర్హుల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఆపై గుర్తించిన అర్హులైన ప్రతి రైతుకు పీఎంకిసాన్‌ రూ.6వేలు, అన్నదాత సుఖీభవ రూ.14 వేలు కలిపి మొత్తం రూ.20 వేలు ఆర్థిక సాయంగా అందించనున్నారు.

Updated Date - May 09 , 2025 | 12:29 AM