Share News

యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - Oct 24 , 2025 | 12:03 AM

మండలంలోని బోడసింగిపేట గ్రామా నికి సమీపంలో రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

యువకుడి ఆత్మహత్య

బొండపల్లి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని బోడసింగిపేట గ్రామా నికి సమీపంలో రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గురు వారం జరిగిన ఈ ఘటనపై బొబ్బిలి రైల్వే ఇన్‌చార్జి ఎస్‌ఐ డి.రత్నకుమార్‌ తెలి పిన వివరాలు ఇలా ఉన్నాయి. గజపతినగరం మండలం తుమ్మకాపల్లి గ్రామాని కి చెందిన నడిపిల్లి వెంకటేష్‌(23) ఇటీవల తన తండ్రి చనిపోవడంతో మనస్తా పానికి గురయ్యాడు. ఈమేరకు గురువారం బోడసింగిపేట సమీపంలో ఉన్న రైల్వే ట్రాకుపై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్‌ మాస్టర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని వద్ద లభించిన ఆధారాలను సేకరించారు. కేసు నమోదుచేసి, మృతదేహాన్ని పంచనామా నిమిత్తం జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రికి తరలించారు.

Updated Date - Oct 24 , 2025 | 12:03 AM