Share News

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , Publish Date - Jun 02 , 2025 | 12:18 AM

మండలంలోని రాజాపులోవ జాతీయ రహదారిపై ప్రమాదానికి గురై ఆసు పత్రిలో చికిత్స పొందుతున్న విశాఖ జిల్లా భీమిలి మండ లంలోని టి.నగరపాలెంకు చెందిన యువకుడు గడ దాసరి సాయి (27) ఆదివారం మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
సాయి (ఫైల్‌)

భోగాపురం, జూన్‌1(ఆంధ్రజ్యోతి): మండలంలోని రాజాపులోవ జాతీయ రహదారిపై ప్రమాదానికి గురై ఆసు పత్రిలో చికిత్స పొందుతున్న విశాఖ జిల్లా భీమిలి మండ లంలోని టి.నగరపాలెంకు చెందిన యువకుడు గడ దాసరి సాయి (27) ఆదివారం మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నగరపాలెంకు చెంది న సాయి శనివారం ద్విచక్ర వాహనంపై నగర పాలెం నుంచి విజయనగరం వెళ్లాడు. అక్కడ పనులు ముగిం చుకుని మరలా అదేరోజు రాత్రి బయలుదేరాడు. రాజాపులోవ సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలమైన గాయాలయ్యాయి. విషయం తె లుసుకున్న కుటుంబ సభ్యులు విశాఖలోని కేజీహెచ్‌లో చేర్చారు. అక్కడ చికి త్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి తల్లిదండ్రులు, ఇద్దరు సోదరు లు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ పి.సూర్యకుమారి తెలిపారు.

Updated Date - Jun 02 , 2025 | 12:18 AM