Share News

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , Publish Date - Apr 23 , 2025 | 12:16 AM

మండలంలోని కొండతామారాపల్లి సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు,

రోడ్డు ప్రమాదంలో యువకుడి  మృతి

గంట్యాడ, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొండతామారాపల్లి సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు, మరో ఇద్దరు యువకులు గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ సాయికృష్ణ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ పరిఽధిలోని భీమిలి మండలం చినగదిలికి చెందిన యువకులు జి.దినీష్‌, కార్తీక్‌, సింహాద్రి మంగళవారం వేకువజామున ఉదయం 4.30 సమయంలో అనంత గిరి వ్యూపాయింట్‌ వద్దకు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. తిరిగి భీమిలికి వస్తుం డగా కొండతారామపల్లి వద్ద కల్వర్డును బలంగా ఢీ కొన్నారు. దాంతో ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న దినీష్‌(22) అక్కడిక్కడే మృతి చెందాడు. గాయపడిన కార్తీక్‌, సింహాద్రిలను స్థానికులు 108 వాహనంలో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ సాయికృష్ణ పరిశీలించి కేసు నమోదు చేశారు.

Updated Date - Apr 23 , 2025 | 12:16 AM