Share News

మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలి

ABN , Publish Date - May 24 , 2025 | 11:39 PM

మహిళలు ఆర్థికాభివృద్ధి చెందడానికి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు, పథ కాలు ప్రవేశపెడుతోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు తెలిపారు.

మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలి
మాట్లాడుతున్న రామ్‌మల్లినాయుడు :

మెరకముడిదాం, మే 24(ఆంధ్రజ్యో తి):మహిళలు ఆర్థికాభివృద్ధి చెందడానికి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు, పథ కాలు ప్రవేశపెడుతోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు తెలిపారు. శనివారం మండలంలోని గర్భాం గ్రామ సచివాలయంలో ఏపీబీసీ సహకార ఆర్థిక సంస్థ మంజూరు చేసిన ఉచిత కుట్టు మిషన్‌ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈసందర్భంగా మాట్లా డుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కుట్టు మిషన్‌ శిక్షణ కార్యక్రమాన్ని మహిళలం తా సద్వినియోగంచేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు తాడ్డి సన్యాసినాయుడు, టీడీపీ నాయకులు తాడ్డి చంద్రశేఖర్‌, కోట్ల మోతీలాల్‌ నాయుడు, రమణ మోహనరావు, పి.సన్యాసినాయుడు, సర్పంచ్‌ గాబ్రియేలు, ఎంపీడీవో జి.భాస్కరరావు, ఈవోపీఆర్‌డీ విశ్వనాథం పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2025 | 11:39 PM