Share News

విశాఖ ఆర్టీసీ బస్టాండ్‌లో మహిళ మృతి

ABN , Publish Date - Aug 12 , 2025 | 12:24 AM

జిల్లాలోని ఎస్‌.కోటకు చెందిన గేదెల ముత్యాలమ్మ అనే మహిళ విశాఖపట్టణంలోని ద్వారక బస్టాండ్‌ లో గల 25వ ప్లాట్‌ఫాంలో బస్సు ఢీకొని మృతిచెందింది.

 విశాఖ ఆర్టీసీ బస్టాండ్‌లో మహిళ మృతి

విజయనగరం రింగురోడ్డు, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఎస్‌.కోటకు చెందిన గేదెల ముత్యాలమ్మ అనే మహిళ విశాఖపట్టణంలోని ద్వారక బస్టాండ్‌ లో గల 25వ ప్లాట్‌ఫాంలో బస్సు ఢీకొని మృతిచెందింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. శ్రీకాకుళం నుంచి విశాఖపట్టణం వెళ్లే బస్టాప్‌ వద్ద మధ్యాహ్న సమయంలో ముత్యాలమ్మ బస్సు కోసం వేచిఉంది. బస్సు ఎక్కేందుకు ప్లాట్‌ఫాం సమీపంలోకి వెళ్లింది. దీంతో ప్రమాదవశాత్తు బస్సు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

Updated Date - Aug 12 , 2025 | 12:24 AM