Share News

గుర్తుతెలియని వాహనం ఢీ: మహిళ మృతి

ABN , Publish Date - May 04 , 2025 | 11:58 PM

రామభద్రపురంలోని కొండ కెంగువ బైపాస్‌ రోడ్డు వద్ద ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ మహిళ మృతి చెందింది.

గుర్తుతెలియని వాహనం ఢీ: మహిళ మృతి

రామభద్రపురం, మే 4(ఆంధ్రజ్యోతి): రామభద్రపురంలోని కొండ కెంగువ బైపాస్‌ రోడ్డు వద్ద ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ఎస్‌ఐ వెలమల ప్రసాద రావు కథనం మేరకు.. రామభద్రపురంలోని శ్రీరామ్‌నగర్‌ కాలనీకి చెందిన చలమల సత్యవతి (65) కూరగాయల మార్కెట్‌లో వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ మేరకు ఆదివారం తెల్లవారుజామున మార్కెట్‌కు వెళ్తోంది. ఆ సమయంలో కొండకెంగువ బైపాస్‌ రోడ్డులోసాలూరు నుంచి వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్‌సీ కి తరలించారు. భర్త చలమల చిన్నా ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ రమణ కేసు నమోదుచేశారు.

Updated Date - May 04 , 2025 | 11:58 PM