Share News

Resolve the Issues నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం

ABN , Publish Date - Apr 30 , 2025 | 11:54 PM

We Will Resolve the Issues of the Displaced తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరి స్తామని పార్వతీపురం ప్రత్యేక ఉప కలెక్టర్‌ ధర్మారెడ్డి తెలిపారు. బుధవారం నందివానివలస పునరావాస ప్రాంతాన్ని సందర్శించారు.

 Resolve the Issues     నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం
నందివానివలసలోని నిర్వాసిత కుటుంబాల సమస్యలు తెలుసుకుంటున్న ఎస్‌డీసీ ధర్మారెడ్డి

గరుగుబిల్లి, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరి స్తామని పార్వతీపురం ప్రత్యేక ఉప కలెక్టర్‌ ధర్మారెడ్డి తెలిపారు. బుధవారం నందివానివలస పునరావాస ప్రాంతాన్ని సందర్శించారు. శిఽథిలావస్థకు చేరుకున్న గృహాలను పరిశీలించారు. గృహ నిర్మాణాలకు సంబంధించి కొంతమేర స్థలం ఉందని తహసీల్దార్‌ పి.బాల వివరించారు. పూర్తిస్థాయిలో నివేదికలు తయారు చేసి అందించాలని ఆయన ఆదేశించారు. ఏ సమయంలో గృహాలు కూలుతాయోనని ఆందోళనగా ఉందని, అధికారులు స్పందించి తగు న్యాయం చేయాలని నిర్వాసితులు కోరారు.

Updated Date - Apr 30 , 2025 | 11:54 PM