మంచి ప్రభుత్వానికి అండగా ఉండాలి
ABN , Publish Date - Jul 09 , 2025 | 12:00 AM
: ప్రజలు మంచి ప్రభుత్వానికి అండగా ఉండాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కళావెంకటరావు కోరారు.వైసీపీనాయకులు తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని లవిడాం గ్రామంలో సీసీరోడ్డును ప్రార ంభించారు.
గుర్ల, జూలై 8(ఆంధ్రజ్యోతి): ప్రజలు మంచి ప్రభుత్వానికి అండగా ఉండాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కళావెంకటరావు కోరారు.వైసీపీనాయకులు తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని లవిడాం గ్రామంలో సీసీరోడ్డును ప్రార ంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది వైసీపీ నాయకులు అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నాయకులు కేటీఆర్, వెన్న సన్యాసినాయుడు, కిరణ్కుమార్,సీహెచ్ మహేశ్వరరావు, దాసరి శివప్రసాద్, సన్యాసినాయుడు పాల్గొన్నారు.