రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
ABN , Publish Date - Sep 30 , 2025 | 12:04 AM
స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.
బొబ్బిలి, సెస్టెంబరు 29 (ఆంరఽధజ్యోతి): స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు సుమారు 30 ఏళ్ల లోపు ఉంటుందని జీఆర్పీ హెచ్సీ బండారు ఈశ్వరరావు తెలిపారు. ఎరుపు రంగు గళ్ల ఫుల్ హేండ్స్ షర్ట్, బ్రౌన్ కలర్ అండర్ వేర్ ధరించి ఉన్నాడన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు రైల్వే పోలీసులకు సమాచారాన్ని 8309901038, రైల్వే ఎస్ఐ వి.బాలజీరావు 9490617089 నెంబరుకు అందజేయాలని కోరారు.