Share News

ఎస్‌ఐని సస్పెండ్‌ చేయాలి

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:20 AM

అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీరభద్ర స్వామి ఉత్సవాల ఊరేగింపులో భక్తులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, రాయచోటి ఎస్‌ఐని సస్పెండ్‌ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

ఎస్‌ఐని సస్పెండ్‌ చేయాలి
కలెక్టరేట్‌ వద్ద నిరసన దీక్ష చేపట్టిన వీహెచ్‌పీ నాయకులు:

బెలగాం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) :అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీరభద్ర స్వామి ఉత్సవాల ఊరేగింపులో భక్తులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, రాయచోటి ఎస్‌ఐని సస్పెండ్‌ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురం కలెక్టరేట్‌ వద్ద వీహెచ్‌పీ ఆధ్వర్యంలో దాడికి వ్యతిరేకంగా నిరసన దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా ఓ వర్గం భక్తులపై దాడి చేసిందని, వారిని అదుపుచేయలేక పోలీసులు దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 12:20 AM