శ్యామలాంబ పండగను విజయవంతంగా నిర్వహించాలి
ABN , Publish Date - Apr 27 , 2025 | 11:49 PM
): సాలూరు గ్రామదేవత శ్యామ లాంబ అమ్మవారి పండగను విజయవంతంగా నిర్వహించాలని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు. ఆది వారం పట్టణంలో శ్యామలాంబ అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని పరిశీలిం చారు.
సాలూరు, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): సాలూరు గ్రామదేవత శ్యామ లాంబ అమ్మవారి పండగను విజయవంతంగా నిర్వహించాలని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు. ఆది వారం పట్టణంలో శ్యామలాంబ అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని పరిశీలిం చారు. పరిసరాలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా ఉంచాలని, భక్తుల దర్శ నానికి ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. ఆమె వెంట ఉత్సవ కమిటీ అధ్యక్షుడు అక్కేన అప్పారావు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు(చిట్టీ), కేతిరెడ్డి చంద్రశేఖర్తోపాటు పలువురు ఉన్నారు.