Share News

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

ABN , Publish Date - Apr 27 , 2025 | 12:20 AM

ప్రజా సమస్యలు పరిష్క రించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

  • ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి

గుమ్మలక్ష్మీపురం, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలు పరిష్క రించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. శనివారం గుమ్మలక్ష్మీపురంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ఆమె ప్రజా దర్బార్‌ నిర్వహించారు. నియోజకవ ర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆమె అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త కడ్రక మల్లేశ్వరరావు, నాయకులు విప్లవకుమార్‌, సత్యంనాయుడు తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 27 , 2025 | 12:20 AM