సమస్యల పరిష్కారమే ధ్యేయం
ABN , Publish Date - May 22 , 2025 | 12:16 AM
:ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్క రించడమే ధ్యేయమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు.
పార్వతీపురం రూరల్, మే 21 (ఆంధ్రజ్యోతి):ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్క రించడమే ధ్యేయమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. బుధవారం మండలంలోని నర్సిపురంలోనిటీడీపీకార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు.ఈ సందర్భం గా ప్రజల వినతుల రూపంలో అందించిన సమస్యలను పరిశీలించి వాటిలో తక్షణమే కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి పూర్తి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.