సుపరిపాలనలో తొలి అడుగు
ABN , Publish Date - Jun 24 , 2025 | 12:01 AM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా రాజధాని అమరావతిలో సోమవారం సాయంత్రం సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
- అమరావతిలో ప్రత్యేక సమావేశం
- హాజరైన జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు
పార్వతీపురం, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా రాజధాని అమరావతిలో సోమవారం సాయంత్రం సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గడచిన ఏడాదిలో చేపట్టిన పాలనా సంస్కరణలు, తీసుకొచ్చిన మార్పులు, అందించిన సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి చేసిన కృషిని సమీక్షించారు. రెండో ఏడాదిలో ఏం చేయాలి.. ఎలాంటి కార్యక్రమాలు, లక్ష్యాలను చేపట్టాలో చర్చించారు. ఈ సమావేశానికి రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, ఎమ్మెల్యే బోనెల విజయ్చంద్ర, జిల్లా కలెక్టర్ శ్యామ్ప్రసాద్, ఎస్పీ మాధవరెడ్డి, జాయింట్ కలెక్టర్ శోభిక, జీసీసీ చైర్మన్ కె.శ్రావణ్కుమార్ తదితరులు హాజరయ్యారు.