ఫాంపాండ్స్ పనులు చేపట్టండి
ABN , Publish Date - May 14 , 2025 | 12:42 AM
అన్ని పంచాయతీల్లో ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఫాం పాండ్స్ పనులను చేపట్టాలని డ్వామా పీడీ ఎస్.శారదదేవి సిబ్బందిని ఆదేశించారు.
నెల్లిమర్ల, మే 13 (ఆంధ్రజ్యోతి): అన్ని పంచాయతీల్లో ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఫాం పాండ్స్ పనులను చేపట్టాలని డ్వామా పీడీ ఎస్.శారదదేవి సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం మండలంలోని రామతీర్థం, పెరబూరాడపేట గ్రామాల్లో ఆమె పర్యటించారు. రామతీర్థంలోని తాటిమాను చెరువులో పనులను పరిశీలించి వేతనదారులతో మాట్లాడారు. రెండు పూటలా పనులు చేపట్టి రూ.307 గిట్టుబాటు వేతనం పొందాలన్నారు. కార్యక్రమంలో ఏపీవో రామారావు, ఈసీ వినోద్ తదితరులు పాల్గొన్నారు.