Share News

31 నుంచి తైక్వాండో పోటీలు

ABN , Publish Date - May 25 , 2025 | 11:40 PM

బొబ్బిలిలో ఈనెల 31 నుంచి స్థానిక తైక్వాండో క్లబ్‌ ఆధ్వర్యంలో 18వ జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు నిర్వహించనున్నట్లు బొబ్బిలి తైక్వాండో అధ్యక్షుడు, ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు.

 31 నుంచి తైక్వాండో పోటీలు
బ్యానర్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే బేబీనాయన

బొబ్బిలి రూరల్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలిలో ఈనెల 31 నుంచి స్థానిక తైక్వాండో క్లబ్‌ ఆధ్వర్యంలో 18వ జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు నిర్వహించనున్నట్లు బొబ్బిలి తైక్వాండో అధ్యక్షుడు, ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు. ఆదివారం బొబ్బిలి కోటలో తైక్వాండో పోటీలకు సంబంధించిన బ్యానర్‌ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల నుంచి సుమారు 200 మంది సబ్‌ జూనియర్‌, జూని యర్‌ క్యాడెట్‌, సీనియర్స్‌ విభాగాల్లో క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొ నున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు వచ్చే నెల 9, 10, 11 తేదీల్లో అనంతపురం జిలా ్లతాడిపత్రిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. జిల్లా తైక్వాండో అసోసియేషన్‌ కార్యదర్శి చెలికాని వేణుగోపాలరావు ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్య క్రమంలో కోచ్‌ బంకురు ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2025 | 11:40 PM