Share News

ఏపీఎన్జీవో అధ్యక్షుడిగా సుధాకరరావు

ABN , Publish Date - Dec 09 , 2025 | 11:38 PM

ఎస్‌.కోట తాలూకా ఏపీఎన్జీవో అధ్యక్షు డిగా ఎస్‌వీ సుధాకరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం శృంగవరపుకోట ఏపీఎన్జీవో తాలూకా కార్యాలయంలో కొత్తవలస తాలూకా ఏపీఎన్జీవో అధ్యక్షుడు జేవీ ప్రసాదరావు ఎన్నికలఅధికారిగా ఎన్నిక నిర్వహించారు.

 ఏపీఎన్జీవో అధ్యక్షుడిగా సుధాకరరావు
ఎన్నికైన శృంగవరపుకోట తాలూకా ఏపీఎన్జీవో కార్యవర్గం:

శృంగవరపుకోట, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి):ఎస్‌.కోట తాలూకా ఏపీఎన్జీవో అధ్యక్షు డిగా ఎస్‌వీ సుధాకరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం శృంగవరపుకోట ఏపీఎన్జీవో తాలూకా కార్యాలయంలో కొత్తవలస తాలూకా ఏపీఎన్జీవో అధ్యక్షుడు జేవీ ప్రసాదరావు ఎన్నికలఅధికారిగా ఎన్నిక నిర్వహించారు.అసోసియేట్‌ అధ్యక్షులుగా జె.సంధ్యాకళ్యాణి, ఉపాధ్యక్షులుగా సీహెచ్‌ కృష్ణ, వై.రామచంద్రరావు, ఎల్‌.బంగారు నా యుడు, ఎస్‌.చంద్రరావు, కె.దేవి, కార్యదర్శి జి.వెంకటేశ్వరరావు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా బి.అనుష, జాయింట్‌ సెక్రటరీలుగా ఎ.చిన్నారావు, కె.హరి, ఎస్‌.కె ఫెరోజ్‌, హరినాథ్‌, మహిళ జాయింట్‌ సెక్రటరీగా ఎంజే ఉదయలక్ష్మిను ఎన్నుకున్నారు.

Updated Date - Dec 09 , 2025 | 11:38 PM