Share News

దుకాణాలు కొనసాగించాలి

ABN , Publish Date - May 20 , 2025 | 12:09 AM

గరివిడి రైల్వేస్టేషన్‌ సమీపంలో రైల్వే బ్రిడ్జి దగ్గరలో దుకాణాలు ఖాళీచేయించకుండా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరారు.

దుకాణాలు కొనసాగించాలి
కలిశెట్టి అప్పలనాయుడుకు వినతిపత్రం అందజేస్తున్న వ్యాపారులు :

గరివిడి, మే 19(ఆంధ్రజ్యోతి): గరివిడి రైల్వేస్టేషన్‌ సమీపంలో రైల్వే బ్రిడ్జి దగ్గరలో దుకాణాలు ఖాళీచేయించకుండా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరారు.ఈ మేరకు తమ సమస్యను పరిష్కరించాలని సోమవారం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావులకు పట్టణ టీడీపీ నేతలు వర్మరాజు, టి.శ్రీను, చిన్నా, దివాకర్‌, నరసింగరావు తదితరుల ఆధ్వర్యంలో వ్యాపారులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా గరివిడి రైల్వే బ్రిడ్జి సమీపంలో 30 సంవత్సరాలుగా రైల్వే జాగాలో షాపులు ఏర్పాటు చేసుకొని వివిధ రకాల వ్యాపా రాలు చేస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించి 2023 వరకు రైల్వే శాఖ వారికి అద్దెలు, శిస్తులు కూడా చెల్లిస్తున్నామని చెప్పారు. పదిరోజుల కిందట రైల్వే అధి కారులు షాపులను ఖాళీ చేయాలని నోటీసులిచ్చారని తెలిపారు. దీంతో 30 షాపుల్లో వ్యాపారాలు చేస్తున్న వందమంది వరకు అనాథలవుతామని పేర్కొన్నారు.

Updated Date - May 20 , 2025 | 12:09 AM