అభివృద్ధి దిశగా అడుగులు
ABN , Publish Date - Jul 19 , 2025 | 11:30 PM
అభివృద్ధి, సంక్షేమం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న దని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు.
విజయనగరం రూరల్, జూలై 19(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న దని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శనివారం ఆమె విజయనగరంలోని 29, 30, 31 డివిజన్ల లోనూ, మండల పరిధిలోని బియ్యాలపేట గ్రామంలో ప్రజలతో మమేకమయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర, మండల నాయకులు పాల్గొన్నారు.
కూటమితోనే సుపరిపాలన
నెల్లిమర్ల, జూలై 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతోనే సుపరిపాలన సాధ్యమని ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు అన్నారు. మండలంలోని చినబూరాడపేట, పారసాం గ్రామాల్లో టీడీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిశీలకుడు సువ్వాడ రవిశేఖర్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి గేదెల రాజారావు, పార్టీ నాయకులు బెల్లాన రాజినాయుడు తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు పాలనలో ఆనందంగా ఉన్నాం
జామి, జూలై 19 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ పాలన కంటే ప్రస్తుత చంద్రబాబు పాలనలో చాలా సంతోషంగా ఉన్నామని లక్ష్మీపురం గ్రామ మహిళలు తెలిపారు. సుప రిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మె ల్యే కోళ్ల లలితకుమారి శనివారం లక్ష్మీపురంలో పర్యటించా రు. ఈసందర్భంగా ఆమె కూటమి పాలనపై అభిప్రాయా లు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వెలమ కార్పొరేషన్ డైరక్టర్ శ్రీలక్ష్మి, పార్టీ మండల కార్యదర్శి రమ ణ, ఎర్నాయుడు తదితరులు పాల్గొన్నారు.