అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు స్థల పరిశీలన
ABN , Publish Date - Jun 18 , 2025 | 11:57 PM
కురుపాంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు కోసం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి బుధవారం స్థల పరిశీలన చేశారు.
కురుపాం, జూన్ 18(ఆంధ్రజ్యోతి): కురుపాంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు కోసం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి బుధవారం స్థల పరిశీలన చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటీన్లకు నిధులు మంజూరు చేసి, టెండర్లు ఖరారు చేసింది. ఈ మేరకు స్థానిక ఎంపీడీవో కార్యాయం సమీపంలో కోర్టు, హౌసింగ్ కార్యాలయం వద్ద ఉన్న స్థలాన్ని ఆమె హౌసింగ్ శాఖ పీడీ ఆర్.వంశీకృష్ణ, అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ కార్యాయాలకు దూర ప్రాంతం నుంచి వచ్చే వారికి ఉపయోగకరంగా ఉంటుందని, అందువల్ల ఇక్కడే నిర్మించాలని హౌసింగ్ పీడీ వంశీకృష్ణకు ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ కేవీ కొండయ్య, టీడీపీ నాయకులు కోలా చిరంజీవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.