త్రివిధ దళాల పోరాటానికి సెల్యూట్
ABN , Publish Date - May 10 , 2025 | 12:07 AM
దేశం కోసం వీరోచితంగా పోరా టం చేస్తున్న త్రివిధ దళాలకు కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సెల్యూట్ చేశారు.

గుమ్మలక్ష్మీపురం, మే 9 (ఆంధ్రజ్యోతి): దేశం కోసం వీరోచితంగా పోరా టం చేస్తున్న త్రివిధ దళాలకు కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సెల్యూట్ చేశారు. శుక్రవారం గుమ్మలక్ష్మీపురంలోని తన క్యాంప్ కార్యాల యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ దేశాని కి రక్షణ కల్పిస్తున్న ఆర్మీ, నేవీ, ఎయిర్పోర్స్ దళాలకు పాదాభివందనం చేస్తున్నామన్నారు. శత్రువులకు ధీటుగా ఎదుర్కొని సమాధానమిస్తున్న సైనికులకు దేశ ప్రజలు మద్దతుగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమంలో జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కడ్రక మల్లేశ్వరరా వు, నాయకులు మరడాన తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు.