వేతనదారులు సమయపాలన పాటించాలి: ఏపీడీ
ABN , Publish Date - Dec 25 , 2025 | 12:03 AM
ఉపాధి వేతనదారులు సమయపాలన పాటించకపోతే సిబ్బందిపై చర్యలకు వెనుకాడబోనని ఏపీడీ చంద్రావతి హెచ్చరించారు
వంగర, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఉపాధి వేతనదారులు సమయపాలన పాటించకపోతే సిబ్బందిపై చర్యలకు వెనుకాడబోనని ఏపీడీ చంద్రావతి హెచ్చరించారు. బుధవారం అరసాడ, వంగరలో పని ప్రదేశంలో వేతన దారులతో మాట్లాడారు. వేతనదారులు పని ప్రదేశంకు ఉదయం ఏడుగంటలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జీపీఎస్ గుర్తించి వెబ్ కెమొరాద్వారా సందేశంకార్యాలయానికి పంపించా లని కోరారు. సిబ్బంది నిర్లక్షం వహిస్తే చర్యలకు వెనుకాడబోనని తెలిపారు.