Share News

రోడ్లకు మరమ్మతులు చేయండి

ABN , Publish Date - Jun 20 , 2025 | 12:05 AM

:బొబ్బిలి పట్టణ పరిధిలోని ఆర్టీసీకాంప్లెక్స్‌ జంక్షన్‌ నుంచి రాజా కళాశాల మీదుగా పూల్‌బాగ్‌ జంక్షన్‌ వరకు గల రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేయాలని ఎమ్మెల్యే బేబీనాయన అధికారులను ఆదేశించారు. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండడంతోవాహనచోదకులు,పాదచారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.దీంతో గురువారం మునిసిపల్‌ చైర్మన్‌ రాం బార్కి శరత్‌బాబు, కమిషనరు లాలం రామలక్ష్మి, మునిసిపల్‌ డీఈఈ కిరణ్‌కుమార్‌, టీడీపీ పట్టణాధ్యక్షుడు గెంబలి శ్రీనివాస రావుతో కలిసి పాడైన రోడ్లను పరిశీలించారు.

రోడ్లకు మరమ్మతులు చేయండి
బొబ్బిలిలో రోడ్డును పరిశీలిస్తున్న బేబీనాయన:

బొబ్బిలి, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి):బొబ్బిలి పట్టణ పరిధిలోని ఆర్టీసీకాంప్లెక్స్‌ జంక్షన్‌ నుంచి రాజా కళాశాల మీదుగా పూల్‌బాగ్‌ జంక్షన్‌ వరకు గల రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేయాలని ఎమ్మెల్యే బేబీనాయన అధికారులను ఆదేశించారు. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండడంతోవాహనచోదకులు,పాదచారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.దీంతో గురువారం మునిసిపల్‌ చైర్మన్‌ రాం బార్కి శరత్‌బాబు, కమిషనరు లాలం రామలక్ష్మి, మునిసిపల్‌ డీఈఈ కిరణ్‌కుమార్‌, టీడీపీ పట్టణాధ్యక్షుడు గెంబలి శ్రీనివాస రావుతో కలిసి పాడైన రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్లపై గుంతలను పూడ్చి, రాకపోకలకు అనువుగా రోడ్లను తీర్చి దిద్దేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదే శించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అల్లాడ భాస్కరరా వు, బొత్స అప్పులు, కాకల వెంకటరావు, శ్రీనివాసరావు, ఈశ్వరరా వు , బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. కాగా బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే బేబీనాయన ప్రజాదర్బారు నిర్వహించారు. బొబ్బిలి, బాడంగి, తెర్లాం, రామభద్రపురం మండలాల నుంచి ప్రజలు ఇచ్చిన వినతులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడారు.బొబ్బిలికి టీడీపీ పరిశీలకుడిగా నియమితులైన ఉరిటి సురేంద్ర, బాడంగి ఐసీడీఎస్‌ పీవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎమ్మెల్యేను కలుసుకున్నారు.

Updated Date - Jun 20 , 2025 | 12:05 AM