నాలుగో రోజూ కొనసాగిన రిలే దీక్షలు
ABN , Publish Date - May 20 , 2025 | 12:34 AM
స్థానిక ఐటీడీఏ వద్ద ఆంధ్రప్రదేశ్ గిరిజన సలహా మండలి(జేఏసీ) ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు నాలుగు రోజు సోమవారం కూడా కొనసాగాయి.
బెలగాం, మే 19 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఐటీడీఏ వద్ద ఆంధ్రప్రదేశ్ గిరిజన సలహా మండలి(జేఏసీ) ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు నాలుగు రోజు సోమవారం కూడా కొనసాగాయి. ప్రత్యేక డీఎస్సీ ద్వారా గిరిజన ప్రాంతాల ఉపాధ్యాయ పోస్టులను గిరిజనులతో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నాయకులు నినాదాలు చేశారు. జీవో నెంబర్-3 స్థానంలో కొత్త చట్టం తీసుకొచ్చి గిరిజనులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ చైర్మన్ కొండగొర్రె ధర్మారావు, ఏ.నీలకంఠం, సెక్రటరీ కె.జయన్న, వైస్ చైర్మన్లు డి.సీతారాం, రామకృష్ణ, చంద్రశేఖర్, మల్లయ్య, గిరిధర్, సాయిబాబా, ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు టి.సత్యనారాయణ, సూర్యనారాయణ, డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు.